అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తాజాగా కరోనాతో రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 20,71,831కి కరోనా కేసులు చేరాయి. కరోనాతో మొత్తం 14,430 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,175 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,55,226 మంది రికవరీ చెందారు.