Uncategorized

నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. సమావేశానికి టీడీపీ (TDP) ఎంపీలు, కేంద్రమంత్రులు హాజరవుతారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడం, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీ కొన్ని శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఎంపీలు ఢిల్లీలో ఉంటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు పార్లమెంట్ సభ్యులకు సూచించారు. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడటంతో.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కీలక అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయడంతో పాటు.. ప్రాధాన్యత క్రమాలను వివరించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button