Uncategorized

ఐటీఆర్ గడువు పొడిగింపుపై.. ఐటీ శాఖ కీలక ప్రకటన.. 

 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఇవాళ్టితో గడువు పూర్తవుతుంది. తమ అకౌంట్ ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులందరూ జులై 31, 2024లోపు రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. జులై 30వ తేదీ వరకు 6 కోట్లకుపైగా ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులు ఫైల్ చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది తమ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం ద్వారా రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నట్లు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ పేయర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో గడువు పొడిగంచారన్న వార్తలు వస్తున్నాయి. డెడ్‌లైన్ ముగుస్తున్న క్రమంలో తాజాగా ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది.

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు పొడిగించారన్న వార్తలకు సంబంధించి ఐటీ శాఖ ట్యాక్స్ పేయర్లను హెచ్చరించింది. ‘ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల గడువు ఆగస్టు 31, 2024కు పొడిగించారంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ న్యూస్ క్లిప్పింగ్ సర్క్యూలేట్ అవుతోంది. అది పూర్తిగా తప్పుడు వార్త. అలాంటి వార్తలను నమ్మి ట్యాక్స్ పేయర్లు మోసపోవద్దు. ఆర్థిక ఏడాది 2023-24 సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ జులై 31, 2024తో ముగియనుంది. ఫేక్ న్యూస్ బారిన పడి మోసపోకుండా నిర్దేశిత సమయంలోపు తమ రిటర్నులు దాఖలు చేయాలని ట్యాక్స్ పేయర్లను కోరుతున్నాం.’ అని పేర్కొంది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం.

గుజరాత్‌కి చెందిన ఓ ప్రముఖ వార్త పత్రికలో ఐటీఆర్ గడువు పొడిగించినట్లు కథనం ప్రచురితమైంది. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మేరకు ఐటీ శాఖ స్పష్టత ఇచ్చింది. ట్యాక్స్ పేయర్లు అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని హెచ్చరించింది. మరోవైపు.. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ సైతం తప్పుగా అర్థం చేసుకుని ఐటీఆర్ గడువు పొడిగించారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు ఐటీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ అనేది ఐటీఆర్ గడువు పొడిగించేందుకు కాదని, ఐటీఆ గడువు జులై 31, 2024తో ముగుస్తుందని మరోసారి స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button