Uncategorized

వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు.. మాజీ మంత్రికి ముఖ్యమైన బాధ్యతలు, వాళ్లందరికి పదవులు

వైఎస్సార్‌సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్.. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీ కూడా పూర్తయ్యింది. తాజాగా మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలంపాటు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గోసుల శివభరత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. వాస్తవానికి భరత్ గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశించగా.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అవకాశం దక్కింది.

అలాగే గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా వ్యవహరించిన చంద్రశేఖరరెడ్డిని ఎంప్లాయిస్, పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎ.రవిచంద్ర, ఇంటెలెక్చువల్‌ ఫోరం అధ్యక్షుడిగా వై.ఈశ్వర్‌ప్రసాద్‌ను నియమించినట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పుత్తా శివశంకర్, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, కందుల రవీంద్రారెడ్డిలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశ­మయ్యారు. పార్టీకి సంబంధించి దాదాపు 24 అనుబంధ విభాగాలను క్రియాశీలకం చేస్తున్నామని.. పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టంగా నిర్మిద్దామన్నారు. వైఎస్సార్‌సీపీ అందరి పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా పార్టీని మరింతగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమా­లపై చర్చించి.. భవిష్యత్‌ కార్యాచరణపై అందరికి దిశా నిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఆర్గనైజ్డ్‌గా పని చేయాలన్నారు జగన్. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని..గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్‌ కదులుతుంది అన్నారు.

పార్టీ కేడర్ యాక్టివ్‌గా ఉంటే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతామన్నారు జగన్. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటేనే ఈ పోరాటం చేయగలుగుతామన్నారు. ఒక పిలుపునిస్తే.. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలన్నారు. పార్టీ ప్రతి ఒక్కరి సేవలను గుర్తిస్తుందని.. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. జిల్లాలో అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు సమ్వయంతో కలిసి పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button