Uncategorized

సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. హైదరాబాద్‌లో సిక్సర్ల వర్షం

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీ చేశాడు. అతడికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి వేయడం గాల్లోకి చూడటం బంగ్లా ఆటగాళ్ల వంతైంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజూ శాంసన్ కేవలం 47 బంతుల్లో 111 పరుగులు (సిక్స్‌లు 8, ఫోర్లు 11) చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు (సిక్స్‌లు 5, ఫోర్లు 8) చేశాడు. సంజూ శాంసన్ 236 స్టైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తే, సూర్యకుమార్ 214 స్టైక్ రేట్‌తో బ్యాట్ ఝళిపించాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య 261 స్టైక్‌రేట్‌తో విరుచుకుపడ్డారు.

రియాన్ పరాగ్ 13 బంతుల్లో 34 (సిక్స్‌లు 4, ఫోర్ 1), హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 (సిక్స్‌లు 4, ఫోర్లు 4) పరుగులు చేశారు. చివర్లో రింకూ సింగ్ 8 పరుగులు (4 బంతుల్లో, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ 1 పరుగు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్ ముందు 298 పరుగుల లక్ష్యం విధించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button