Uncategorized

మహిళలూ బీ రెడీ.. రేపే మంత్రివర్గ సమావేశం.. ఆ శుభవార్త ఖాయం!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రీషెడ్యూలులో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. చెత్తపన్ను రద్దుపైనా.. 13 మున్సిపాలిటీలలో 190 పోస్టుల భర్తీపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

మరోవైపు దేవాలయాల్లో పాలకమండళ్ల నియామకంపైనా ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. పాలకమండళ్లలో సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 పెంచాలని, ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా తీసుకోవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇక స్వర్ణకారుల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుపైనా కేబినెట్ చర్చించనుంది. ఇక మహిళలపై అఘాయిత్యాలను కట్టడి చేసేందుకు.. మహిళలపై దాడులకు పాల్పడేవారికి త్వరగా శిక్షలు పడేలా ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపైనా ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

ఇక అన్నింటి కంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపొందించిన పాలసీలను మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించారు. మొత్తం 10 శాఖల్లో నూతన పాలసీలను సిద్ధం చేశారు. అయితే బుధవారం నాటి మంత్రి వర్గ సమావేశంలో ఆరు పాలసీలను చర్చించనున్నట్లు తెలిసింది. పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన పాలసీలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button