Site icon Red News

ఏపీలో మందుబాబులకు మరో షాక్.. ఇక లేనట్లేనా?, వాళ్లకు పండగే!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్‌ రూమ్‌ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పెట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ నిర్ణయం బార్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది.. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

గతంలో ప్రైవేటు పాలసీల్లో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు.. పర్మిట్ రూమ్‌లు ఉంటే.. ఒక్కో షాపు నుంచి ప్రభుత్వానికి రూ.5 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఐదేళ్లు పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు.. చంద్రబాబు సర్కార్ వచ్చాక మళ్లీ ప్రైవేటు మద్యం పాలసీ ప్రకటించినా, పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పర్మిట్ రూమ్‌లు ఇక లేనట్లేనా అని చర్చ జరుగుతోంది. పర్మిట్ రూమ్‌లు లేకపోతే.. మద్యం షాపుల పక్కన రోడ్లపై విచ్చలవిడిగా మద్యం తాగే సంస్కృతి మొదలవుతుందంటున్నారు.

Exit mobile version