Uncategorized

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. శబరిమలకు స్పెషల్ ట్రైన్లు, వివరాలివే..

తెలంగాణ నుంచి చాలా మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం అయ్యప్పను పూజిస్తారు. శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. కొందరు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు ట్రావెల్స్, సొంత వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తుంటారు. అయితే అది కొంత ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్లను నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.

హైదరాబాద్ మౌలాలి నుంచి కేరళ కొల్లం స్టేషన్‌ వరకు నవంబరు 22, 29 తేదీల్లో రెండు స్పెషల్ ట్రైన్లు (ట్రైన్ నెంబర్ 07143) బయల్దేరుతాయని అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం కొల్లం నుంచి మౌలాలికి నవంబరు 24, డిసెంబరు 1 తేదీల్లో ట్రైన్లు (నెంబర్ 07144) అందుబాటులో ఉంటాయన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. ఏపీలోని మచిలీపట్నం నుంచి కొల్లంకు ట్రైన్లు (నెంబర్ 07145) నవంబరు 18, 25 తేదీల్లో, కొల్లం నుంచి మచిలీపట్నంకు ట్రైన్లు (నెంబర్ 07146) నవంబరు 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button