Uncategorized

మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిలు.. సినిమా రేంజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల కొట్లాట చర్చనీయాంశమైంది. మచిలీపట్నానికి చెందిన విజయ్ అనే బిల్డర్‌‌పై అనూష అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో విజయ్ అనే బిల్డర్‌ ముందు అనూష అనే మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడని.. అయితే ఆరు నెలలుగా తనతో ఉండం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తన డబ్బులు, బంగారం తీసుకున్నాడని.. అడిగితే తననే బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ అనిత అనే మరో మహిళత కలిసి ఉంటున్నాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక.. తాను అక్కడికి వెళ్లి అతడి కారును తగులబెట్టానన్నారు. అదే సమయంలో అనిత తనతో గొడవకు దిగిందన్నారు. అతడి కోసం ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్త పోలీసుల దగ్గరకు చేరింది.

విజయ్ అనే బిల్డర్‌తో తాను ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు అనూష. విజయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. రూ.15 లక్షల డబ్బులు రూ.10 లక్షల బంగారం తీసుకున్నట్లు ఆరోపించారు. తాను చుట్టాల దగ్గర అప్పు చేసి ఇచ్చానని.. బంగారాన్ని నాలుగుసార్లు తాకట్టు పెట్టి తిరిగి ఇచ్చాడని.. ఐదోసారి మాత్రం బంగారం తిరిగి ఇవ్వకుండా బ్లాక్ చేశాడన్నారు. తన బంగారం గురించి అడిగితే తాకట్టులో ఉందని చెప్పాడని.. అప్పుడు అనుమానంతో ఆరా తీస్తే విజయ్ ఏడాదిగా మచిలీపట్నంలో అనిత అనే మరో మహిళతో కలిసి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఉద్యోగి అని.. ఆమె తన బంగారం వేసుకుని తిరుగుతోందని ఆరోపించారు.

తెలియడం లేదన్నారు అనూష. తన డబ్బులు గురించి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని.. తాను అసలు డబ్బులే ఇవ్వలేదన్నట్లుగా విజయ్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బై హ్యాండ్ డబ్బులు, బంగారం ఇచ్చానని.. ఆ విషయం ఆయన స్నేహితులకు కూడా తెలుసన్నారు. తనను పెళ్లి చేసుకోమంటే విజయ్ వేధించేవాడని.. ఇప్పుడు తన డబ్బులు, బంగార కూడా తిరిగి ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు విజయ్‌తో కలిసి ఉంటున్న అనితకు గతంలో వివాహమై భర్త ఉన్నాడని.. ఆమెను విజయ్ పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదన్నారు.

విజయ్ తన నంబర్ బ్లాక్‌లో పెట్టాడని అనూష ఆరోపిస్తున్నారు. తానిచ్చిన బంగారం, డబ్బులు తిరిగి ఇవ్వాలని.. తాను ఆయన కారుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టిన మాట వాస్తవమేనన్నారు. ఆయనకు నష్టం జరిగింది నిజమేనని.. తనకు జరిగిన నష్టం సంగతేంటో చెప్పాలన్నారు. ఇప్పటికే విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. విజయ్, అనితల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. వారిద్దరు తనపై దాడి చేశారని అనూష ఆరోపిస్తున్నారు. మచిలీపట్నంలో ఈ ట్రయాంగిల్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button