Uncategorized

Women Schemes: మహిళల కోసం మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌.. వారి ఖాతాల్లో రూ.32 వేలు!

ఈ పథకం ద్వారా రూ. మహిళలు లేదా బాలికల పేరుతో 2 సంవత్సరాల కాలానికి 2 లక్షలు అందజేస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం పోస్టాఫీసుతో పాటు అనేక బ్యాంకుల్లో..

మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ఒకటి ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ (MSSC). మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. మహిళలు చేసిన పెట్టుబడులపై ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోంది. కేంద్ర బడ్జెట్ 2023లో భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం మహిళలకు మద్దతుగా నిలుస్తోంది.

ఈ పథకం ద్వారా రూ. మహిళలు లేదా బాలికల పేరుతో 2 సంవత్సరాల కాలానికి 2 లక్షలు అందజేస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం పోస్టాఫీసుతో పాటు అనేక బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. 2023లో ప్రారంభించిన ఈ పథకం రెండేళ్లపాటు అంటే మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

మహిళా పెట్టుబడిదారులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి సంవత్సరానికి 7.5 శాతం స్థిర వడ్డీ లభిస్తుంది. వడ్డీ ప్రతి 3 నెలలకు లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ఏ మహిళకైనా అనుమతి ఉంది.

ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ ఖాతా ఉన్నవారు.. ఇందులో కనిష్ఠంగా రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీని కాల పరిమితి రెండేళ్లని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ కాలిక్యులేటర్ ప్రకారం, మహిళలు ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడి పెడితే, రెండేళ్లలో వారికి రూ.8,011 వడ్డీని అందజేస్తారు. అంటే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.58,011 అందుకుంటారు. అదే రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో 7.5 శాతం వడ్డీ రేటుతో రూ.1,16,022 పొందుతారు. రూ.1,50,000 డిపాజిట్ చేస్తే రెండేళ్ల తర్వాత రూ.1,74,033 అందుకుంటారు. ఇందులో వడ్డీ ఆదాయం రూ.24,033. ఈ పథకంలో రూ.2,00,000 పెట్టుబడి పెడితే, వడ్డీ కింద రూ.32,044 లభిస్తుంది. మొత్తంగా మెచ్యూరిటీ సమయానికి రూ.2,32,044 అందుకుంటారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకంలో చేరడానికి, తప్పనిసరిగా మహిళ పేరు మీద ఖాతాను తెరవాలి. పిల్లలు, ఇతర మైనర్లకు గార్డియన్‌గా ఉండటం ద్వారా ఖాతాను తెరవవచ్చు. ఈ పథకానికి ఇప్పటికే మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button