Uncategorized

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌..

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్‌ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది హాజరయ్యారు. ఇటీవల ప్రాథమిక కీ వెలువడగా.. మే 20 నుంచి 22వ తేదీ వరకు ఎన్‌టీఏ అభ్యంతరాలను స్వీకరించింది.

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కాలేజీతో సహా పలు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో దాదాపు 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు.

సీయూఈటీ యూజీ-2025 ప్రాథమిక కీపై జూన్‌ 20వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

సెంట్రల్‌ వర్సిటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యాసంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ యూజీ 2025 కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌ (సీయూఈటీ) పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఆన్సర్‌ కీతో పాటు ప్రశ్నపత్రంను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.200 చెల్లించి కీపై అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఉంటుంది. కాగా మే 13 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆధారిత పరీక్షలు జరిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button