Uncategorized

గాంజా శంకర్ అటకెక్కిందా?.. శర్వాతో సంపత్ నంది కొత్త చిత్రం

సంపత్ నంది హిట్టు కొన్ని ఎన్నేళ్లు అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్సాఫీస్ వద్ద ఆడేసింది. ఇక సీటీమార్, గౌతమ్ నందా అంటూ ఓ మోసర్తుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవేవీ కూడా హిట్లు అని చెప్పలేం. ఇక కెరీర్ ప్రారంభంలో వచ్చిన పేరు, సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓ వైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ, కథలను అందిస్తూనే ఉన్నాడు.

మరో వైపు సిల్వర్ స్క్రీన్ మీద దర్శకుడిగా హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్‌తో గత ఏడాది గాంజా శంకర్ ప్రారంభించాడు. కానీ దాని మీద రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీకి ప్రారంభంలో డ్రగ్స్, నార్కోటిక్ టీం సూచనలు ఇవ్వడం.. ఆ తరువాత షూటింగ్ గ్యాప్ రావడంతో అసలు ప్రాజెక్టే క్యాన్సల్ అయిందని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు సంపత్ నంది కొత్త ప్రాజెక్ట్ మీదకు వెళ్లినట్టుగా కనిపిస్తోంది.

శర్వానంద్‌తో సంపత్ నంది కొత్త మూవీని ప్రకటించాడు. ఇది మాస్, యాక్షన్ మూవీగా రానుందట. శర్వాకి కొత్త పాయింట్, కొత్త కథ చెప్పాడట. ఇక సంపత్ నంది చెప్పిన పాయింట్ నచ్చడంతో శర్వా కూడా ఓకే అన్నాడట. అందుకే ఈ ప్రాజెక్టు‌ని ప్రకటించేశారని సమాచారం. అయితే సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ మీద అయితే క్లారిటీ రావడం లేదు.

సాయి ధరమ్ తేజ్ కూడా తన గాంజా శంకర్ మూవీ మీద ఎలాంటి సరైన అప్డేట్లు ఇవ్వడం లేదు. ఆ మధ్య ఏదో ఒక ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. గాంజా శంకర్ ఉందా? లేదా? అని అడిగితే.. అవన్నీ రూమర్లే అని, ఆగిపోయిందన్న విషయం తనకి కూడా తెలీదంటూ రూమర్ల మీద కౌంటర్లు వేశాడు. మరి సంపత్ నంది ఏమో ఇప్పుడు శర్వాతో సినిమా చేసేందుకు రెడీ యిపోయాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button