Uncategorized

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే!

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి.. తాజాగా మరొకరు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116/- విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ మేరకు దాత విరాళం చెక్కును అందించారు. అంతేకాదు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ.4.10 లక్షల విలువైన ఎరువులను టీటీడీ ఉద్యానవన విభాగానికి విరాళంగా అందజేశారు. ఈ ఎరువులను తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగం కార్యాలయంలో ఎరువుల్ని అందజేశారు.

మరోవైపు తిరుమల శ్రీవారి భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు.. రెండు ఘాట్ రోడ్‌లలో బైక్‌ల రాకపోకలను ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుంచి వెంటనే అమలులోకి వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ అంటున్నారు.

అందుకే క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచుగా రోడ్లు దాటుతున్నాయి. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి, సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను మొదటి మరియు రెండవ ఘాట్ రోడ్‌లలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. కావున భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button