Uncategorized

పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,

ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించారు.

కొత్త జంట వాహనంలో తిరుచానూరు సమీపంలో వస్తుండగా పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అలేఖ్య మాత్రం తాము ఇద్దరం 11 ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు మేజర్లమని.. ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని.. పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రేమ జంటను భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

అలేఖ్య, శివలు 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో గురువారం వివాహం చేసుకున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కారులో వస్తుండగా.. తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు ఇష్ట్రపకారమే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఈ పెళ్లి అలేఖ్య తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నట్లు శివ అంటున్నారు. అలేఖ్య కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. తమను పోలీసులే రక్షించాలని శివ కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button