Uncategorized

ఏపీలోకి ఎంటరైన 30 మంది మావోయిస్టులు.. DGP షాకింగ్‌ వ్యాఖ్యలు!

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఆపరేషన్ కతార్ పేరుతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా చతిస్‌ఘడ్ రాష్ట్రంలో గత మూడు నెలలుగా భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు అందరిలో అలజడ రేపుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులకు గట్టి పట్టున్న చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురు దెబ్బగానే అంతా భావిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందగా ఆయన మృతదేహానికి శ్రీకాకుళం జిల్లాలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

చత్తీస్‌ఘడ్‌లో వరుసగా జరుగుతోన్న ఎన్కౌంటర్లతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న ఒరిస్సా, ఏపీ రాష్ట్రాలకు తలదాచుకునేందుకు మావోయిస్టులు తరలిపోతున్నట్లు సమాచారం. కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులకు ఏపీలోని నల్లమల అటవి ప్రాంతం, AOB కొట్టినపిండి. వీటిని గతంలో షెల్టర్ జోన్లుగాను ఉపయోగించుకున్నారు మావోయిస్టులు. తాజాగా చత్తీస్‌ఘడ్‌లో జరుగుతున్న ఎన్కౌంటర్లతో తల దాచుకునేందుకు ఇపుడు ఆంధ్రప్రదేశ్ కు తరలివస్తున్నారట. ఇది ఎవరో అన్నమాట కాదు. రాష్ట్ర DGP ద్వారకా తిరుమలరావు మంగళవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అన్నమాటలివి. ఏపీలోకి ఎంటర్ అయిన మావోయిస్టుల గురించి తాను పెద్దగా చెప్పకూడదు అంటూనే కొంత గుట్టు విప్పారు డీజీపీ.

మూడేళ్ల తర్వాత మొదటిసారిగా ఇటీవల ఏపీలోకి 30 మంది మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు ఎంటర్ అయినట్లు ద్వారకా తిరుమల తెలిపారు. అలా ఏపీ లోకి వచ్చిన 30 మందిలో 13 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయారనీ చెప్పారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వారి కోసం స్పెషల్ టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయని ఆయన అన్నారు. అదే సందర్భంలో పక్క రాష్ట్రాల్లో ఎన్కౌంటర్ చేస్తే ఏపీని షెల్టర్ గా వాడుకునేంత అస్మర్థులుగా ఏపీ పోలీసులు లేరనీ DGP ద్వారకా తిరుమలరావు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button