Uncategorized

ఏపీలో వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు!

AP Rs 4 Lakhs For Construction Of House: ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) 2.0 పథకానికి సంబంధించి 2024-25 నుంచి అమలుచేయనున్న మార్గదర్శకాలను సవరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ గైడ్‌లైన్స్‌ను ఎన్నికల ముందే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇకపై రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించనున్నారు. ఈ రూ.4లక్షల్లో.. కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కచ్చితంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని కూడా అందిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గృహనిర్మాణంపై నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదిక అందించనున్నారు.

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ)-2.0 పథకం కింద ప్రధాని మోదీ 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మించనున్నారు… రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకూ ఈ పథకం వర్తింపజేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉంటే.. రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలతోపాటు ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు కూడా అందిస్తారు.

గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు అందించినట్లు తెలిపింది. అయితే వీటిలో 20 లక్షల మందికే ఇచ్చారని చెబుతున్నారు. వీటిలో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా.. అందులో 6.50 లక్షల ఇళ్లు పూర్తికాగా.. 4 లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదంటోంది కొత్త ప్రభుత్వం.. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే గతంలో పట్టాణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షలు అందించారు. అలాగే ఉపాధిహామీ పథకం కింద పట్టణాభివృద్ధి సంస్థల్లో మరో రూ.30వేలు ఇచ్చింది. గత ప్రభుత్వం పట్టణాల్లో ఒక్కో ఇంటికి రూ.30 వేల చొప్పున అందించింది.చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు ఇళ్లపై దూకుడు పెంచింది.. ముందుగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల అంశంపై.. ఆ తర్వాత కొత్త ఇళ్లపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button