ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా వాయిదా వేసుకోవాలని.. కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దంటూ IMD హెచ్చరించింది.. వాగులు, చెరువులు పొంగే ప్రమాదముందని.. చెరువులకు గండ్లు, రోడ్లు కొట్టుకుపోయే అవకాశాలున్నాయంటూ పేర్కొంది. నాలాలు, మ్యాన్‌హోల్స్‌ దగ్గర అత్యంత అప్రమత్తం అవసరమని హెచ్చరించింది.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ ఐఎండీ పేర్కొంది.. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదముందని పేర్కొంది. ట్రాన్స్‌ఫారం ఉన్న ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పోల్స్‌ దగ్గరకు వెళ్లొద్దని పేర్కొంది.. నల్లా, సంపుల్లో నీటిని కాచి వడబోసుకునే తాగాలని ఆరోగ్యశాఖ సూచించింది. డ్యామ్స్‌ పర్యటనలు తక్షణమే వాయిదా వేసుకోవాలని.. నీటి కుంటలు, వాగులు, నదులు, చెరువుల దగ్గర సెల్ఫీలు, రీల్స్‌ చేయొద్దంటూ హెచ్చరించింది..

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *