ఏపీలో మహిళలకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి, లేకపోతే పథకం రాదు!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమైంది.. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు, విధి విధానాలను రూపొందించి వివరాలన వెల్లడిస్తారు.

ఏపీలో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉండాలంటే.. ముందుగా ఈ-కేవైసీ చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువమంది గ్యాస్ వినియోగదారులు ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోలేదని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దీపావళి నుంచి ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వనున్నారని.. ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులకే పథకానికి అర్హత ఉంటుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్క గ్యాస్ వినియోదారుడు ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నంబర్, వేలిముద్ర నమోదు చేయాలని చెబుతున్నారు. గతంలో కేంద్రం కూడా గ్యాస్ వినియోగదారులు కచ్చితంగా ఈ-కేవైసీ చేయించుకోవాలంటున్నారు. ఈ-కేవైసీ చేసుకోకపోతే కనెక్షన్‌ రద్దు అవుతుందని చెబుతున్నారు.

కూటమి ఇచ్చిన హామీల్లో.. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని.. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు.

ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి.. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే పథకం వర్తింప చేయకూడాదని ఆలోచన చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు అధికారులు. కూటమి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆరు హామీలు ఇచ్చింది. మహిళలకు సంబంధించి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలిచ్చారు. ఇప్పుడు గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకం ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కూడా అమలవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *