Recent Posts

మనిషి కాదు పశువు, అశ్లీల వీడియోలకు బానిస.. కోల్‌కతా నిందితుడిపై సీబీఐ అధికారి

RG Kar Hospital: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణకు సంబంధించి కోల్‌కతా పోలీసులతోపాటు సీబీఐ అధికారులు కూడా సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్టేటస్ రిపోర్టులు సమర్పించారు. ఈ కేసు విచారణను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, కోల్‌కతా పోలీసులు.. నివేదిక అందించారు. మరోవైపు.. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఓ సీబీఐ అధికారి.. నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. …

Read More »

మార్కెట్‌లోకి కొత్త వైరస్.. తెలంగాణ సర్కార్ అలెర్ట్.. హైదరాబాద్‌లో ఆస్పత్రులు సిద్ధం..!

Monkeypox alert: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో.. మరో కొత్త వైరస్ (మంకీపాక్స్) వణికిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలకు కూడా అంతేవేగంగా విస్తరిస్తోంది. ఈ మంకీపాక్స్ (ఎంపాక్స్‌)పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మంకీపాక్స్ వైరస్‌ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు …

Read More »

మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.. క్షతగాత్రులను జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంపై సీఎం అధికారులతో మాట్లాడారు.. …

Read More »