Recent Posts

తెలంగాణ ప్రజలకు సర్కార్ దసరా కానుక.. పండుగకు ఒక రోజు ముందే.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంవైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అందించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిరలో క్యాంపస్‌లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం …

Read More »

అమాంతంగా పెరిగిపోయిన టమాటా ధరలు.. 15 రోజుల్లోనే ట్రిపుల్.. అసలు కారణాలివే..!

కూరగాయలు కొందామంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కూరగాయల ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుందంటున్నారు జనాలు. ఆ రేంజ్‌లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. అందులోనూ.. టమాట ధరలు మండిపోతున్నాయి. నెల కిందటి వరకు టమాటా ధరలు 30 నుంచి 40 రూపాయలు (కిలోకు) ఉండగా.. ఈ 15 రోజుల గ్యాప్‌లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఈ రెండు వారాల్లోనే ఉన్నట్టుండి టమాట రేట్లు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.

Read More »