హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హబ్సిగూడ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ స్కూల్ ఆటో.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో అతివేగంతో రావటం వల్ల.. బస్సు వెనకాల కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో.. ఆటో డ్రైవర్తో పాటు అందులో ఉన్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద ఉరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్ను హుటాహుటిన …
Read More »Prabhas Kalki Ott Update : ఓటీటీలోకి ‘కల్కి’.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ.. ట్విస్ట్ ఇదే
ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. కల్కి చిత్రం వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్లో సందడి చేయబోతోంది. ఈ మేరకు అమెజాన్ నుంచి అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఇక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కల్కి ఓటీటీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిపీట్ మోడ్లో క్లైమాక్స్ సీన్స్ను చూస్తామంటూ సంబరపడిపోతోన్నారు. ఆగస్ట్ 22 నుంచి కల్కి చిత్రం ప్రైమ్లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, …
Read More »విద్యుత్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మళ్లీ ఆ యాప్లలో బిల్లులు కట్టొచ్చు.. కానీ..!
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మునుపటిలాగే.. మొబైల్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ల ద్వారా కరెంట్ బిల్లులు కట్టేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా.. జులై 1 నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు.. థర్డ్ పార్టీ యాప్లలో నిషేదించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. డిస్కంలు బీబీపీఎస్లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, …
Read More »పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్లో లుకలుకలు.. కోర్టుకెక్కిన రచ్చ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ లీగ్లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది దిగ్గజ వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. ఇటీవల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి లీగ్లో భాగమైన పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ జట్టు యజమానుల మధ్య వాటాల విక్రయం విషయంలో వివాదం మొదలైనట్లు సమాచారం. పంజాబ్ …
Read More »చంద్రబాబు హామీ.. 24 గంటల్లోనే డ్రైవర్కు ఆటో అందజేత.. ఆసక్తికర సన్నివేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఆటో డ్రైవర్కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గురువారం గుడివాడ రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్తో మాట్లాడారు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ కుమారుడు రవితేజ తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్ చదువుకు …
Read More »Tirumala: శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహూకరణ.. ఈ హుండీ ప్రత్యేకతలు ఇవే!
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆ వడ్డీకాసులవాడికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొంత మంది తమకు వీలైనంత మేరకు ధన, వాహన, వస్తు రూపేణా శ్రీవారి ఆలయ బాధ్యతలు చూసే టీటీడీ ట్రస్టుకు విరాళంగా అందిస్తుంటారు. ఇంకొంతమంది తిరుమల ఆలయానికి నగలు, వస్తువులు బహుమానంగా అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహుమతిగా అందింది. కొప్పెరవారిపల్లికి చెందిన కామినేని శ్రీనివాసులు, అతని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి కుప్పెర …
Read More »విజయవాడ దుర్గ గుడికి వెళ్తే భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు దర్శన వేళల్లో మార్పు, ఆర్జిత సేవలు నిలిపివేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.. ఈనెల 17 నుంచి 20వతేదీ (శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు ఆలయ అధికారులు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు దుర్గమ్మ ఆలయంలో ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 18వ తేదీ …
Read More »అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. 9 నెలల క్రితమే తండ్రి, ఇప్పుడు కొడుకు..!
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్ 2015లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లాడు. అయితే.. తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు కూడా రాజేష్ రాలేకపోయాడు. తలకొరివి పెట్టడానికి రాకపోవటంతో.. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ.. ఇంతలోనే రాజేష్ చనిపోయాడన్న విషాద వార్త కుటుంబాన్ని …
Read More »ఇంత అమానుషమా.. 20 వేల కోసం సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి..!
ప్రస్తుత సమాజం చాలా కమర్షియల్గా మారిపోయింది. ఎంతగా అంటే.. డబ్బుల కోసం సొంతవాళ్లను కూడా దూరం చేసుకునేంత. రక్తసంబంధానికి కూడా విలువ లేకుండాపోతోంది. దూరం చేసుకుంటే పర్లేదు కానీ.. అందరి ముందు అవమానించి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి.. తలదించుకునేలా చేయటమే శోచనీయం. అలాంటి అమానుష ఘటనే జరిగింది సిద్దిపేటలో. ఇచ్చిన అప్పులో కొంత మొత్తం తిరిగి ఇవ్వలేదన్న కోపంతో.. సొంత అన్నావదినపై దాడి చేయటమే కాకుండా.. వీధిలోకి లాగి ఆలయానికి కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. నాసర్పూర్కి చెందిన పరిశురాములు తన అవసరాల నిమిత్తం.. తన …
Read More »మెయిల్కు రిప్లై ఇవ్వలేదని ఉద్యోగం నుంచి తొలగింపు.. ట్విట్టర్కు రూ.6 కోట్ల భారీ జరిమానా!
మెయిల్కు రిప్లై ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగిని తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్)కు భారీ షాక్ తగిలింది. సదరు ఉద్యోగికి పరిహారం చెల్లించాలని ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్సీ) ఆదేశించింది. పరిహారంగా 5,50,000 బ్రిటన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 కోట్లు చెల్లించాలని ఈ మేరకు స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని ఐర్లాండ్ డబ్ల్యూఆర్సీ తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్ను అక్టోబరు 2022లో సొంతం చేసుకున్న తర్వాత అదే …
Read More »విండ్ఫాల్ టాక్స్ భారీగా తగ్గించిన కేంద్రం.. ఏకంగా 50 శాతం.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..
Latest Petrol Diesel Prices: దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో విండ్ఫాల్ టాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటివి ఉంటాయి. క్రూడాయిల్పైనే అత్యధికంగా కేంద్రం పన్ను విధిస్తుంటుంది. అంతర్జాతీయంగా రేట్లకు అనుగుణంగా ప్రతి నెలలో రెండు సార్లు దీనిని సవరిస్తుంటుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు నెలలో ఒకటో తేదీన ఇప్పటికే ముడి చమురుపై విండ్ఫాల్ టాక్స్ కేంద్రం భారీగా తగ్గించగా.. …
Read More »అన్న క్యాంటీన్లలో తొలిరోజు ఎంతమంది తిన్నారంటే.. ఏడాదికి ఖర్చు ఎంతో తెలుసా!
ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అన్న క్యాంటీన్లు (100) ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు తొలిరోజు అన్న క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి 93 వేల మంది ఆహారం తీసుకున్నారు. వీరిలో అల్పాహారం 32,500, మధ్యాహ్న భోజనం 37,500, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువశాతం …
Read More »వారు డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఉండొద్దు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 17, 2024): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, …
Read More »ఆధార్ లేని వారికి అలర్ట్.. ప్రత్యేక క్యాంపులు.. ఎప్పటి నుంచి అంటే?
మనదేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకూ ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకూ అన్నింటికీ ఆధారే ఆధారం. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా …
Read More »రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన …
Read More »