గుడ్‌మార్నింగ్‌ కాదు జై హింద్.. ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో మార్పు

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. పాఠశాలల్లో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని వాడాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 వ తేదీన దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్యానాలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో …

Read More »

హైదరాబాద్ RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఆ రూట్‌లో ప్రత్యేక సర్వీసులు

హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ (205 F) బస్సులను నేటి నుంచి నడపనున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్‌ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులురాకపోకలు సాగిస్తాయన్నారు. రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందన్నారు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ నుంచి ప్రతిరోజు …

Read More »

కేంద్రం స్కీమ్.. 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్.. రోజుకు రూ. 500, తర్వాత రూ. 15 వేల సాయం

PM Vishwakarma Scheme Benefits: దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్ తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాలు దాదాపు అన్ని వర్గాల వారి కోసం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా స్కీమ్స్ లాంఛ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరేలా వడ్డీలో రాయితీ కల్పిస్తూ రుణాలు మంజూరు …

Read More »

ఒక స్త్రీ కారణంగా.. నాగ చైతన్య-శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి జోస్యం

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెప్తా చూస్కోండి అంటూ నిన్నే ఓ ట్రైలర్ వదిలారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు వారి జాతక రీత్యా, నిశ్చితార్థ ముహూర్తం రీత్యా జరిగేది ఇదే అంటూ వేణుస్వామి తన జోస్యం చెప్పారు. ముందుగా నిశ్చితార్థం జరిగిన ముహూర్తం అసలు బాలేదని తేల్చి చెప్పారు వేణుస్వామి. న్యూమరాలజీ ప్రకారం ‘888’ వచ్చేలా 8వ తారీఖు, 8వ నెల.. దానికి ఇంకొక 8 కలిపితే 24 వచ్చేలా ’08-08-24′ తేదీన నిశ్చితార్థం జరిపించారంటూ …

Read More »

ఏపీ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు శుభవార్త. మూడు నెలల వేతన బకాయిల చెల్లింపులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. కేంద్రం వేతన బకాయిల కింద రూ.2,300 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది మే నెల నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు.. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల బకాయిల విషయాన్ని ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కూలీల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా.. నిధులు …

Read More »

థియేటర్లో అక్షింతలు, పెళ్లి బాజాలు.. మురారి రీరిలీజ్‌కి ఏమన్నా సందడా

మహేష్ బాబు పుట్టినరోజు వస్తే చాలు ఫ్యాన్స్ ఆ నెల మొత్తం పండగలా జరుపుతుంటారు. సినిమాల పరంగానే కాకుండా ఎదుటివారికి సాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుడే మహేష్ అంటే అభిమానులకి ప్రాణం. అందుకే ఆగస్టు 9న వాళ్ల సెలబ్రేషన్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఇక ఈ రోజు మహేష్ బాబు కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ కూడా ఉంది. ఇంకేముంది థియేటర్లలో పండగా చేస్తున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి. అక్షింతలు, బాజాలు మురారి సినిమాలోని ‘అలనాటి …

Read More »

బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గింపు.. పార్లమెంట్‌ ముందుకు బిల్లు

అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న కనీస వివాహ వయసు వ్యక్తిగత చట్టంలో సవరణలను చేసిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్‌ ముందుంచారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో హక్కులను …

Read More »

గన్ లైసెన్స్ కోసం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దరఖాస్తు.. కూటమి ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీనివాస్ కుటంబంలో వివాదాలు రోడ్డెక్కాయి.. ఆయన ఇద్దరు కూతుళ్లు టెక్కలిలో ఇంటి ఎదురుగా నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. అయితే దువ్వాడకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది.. శ్రీనివాస్ గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర గన్ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసుల్ని కలిసి దరఖాస్తు అందజేశారు. కొద్దిరోజులుగా తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కొందరు …

Read More »

గుడ్‌న్యూస్.. ఇక బ్యాంక్ అకౌంట్లకు నలుగురు నామినీలు.. లోక్‌సభలో కేంద్రం బిల్లు

బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి బిగ్ అలర్ట్. ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2024ను లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఖాతాలకు నామినీల సంఖ్యను పెంచేలా మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక నామినీనే ఎంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సంఖ్యను నాలుగుకు పెంచుతూ బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లకు నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం …

Read More »

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.3 లక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీ రుణాలపై కీలక ముందడుగు వేసింది. కేంద్ర పథకం అయిన పీఎం అజయ్‌ని అనుసంధానించి.. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 50 శాతం లేదా గరిష్ఠంగా రూ.50 వేలు రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో రాయితీ విడుదలకు కేంద్రం రూ.151 కోట్లు ఇస్తుంది.. ప్రస్తుతం 100 రోజుల ప్రణాళికలో భాగంగా 1500 మందికి …

Read More »

ఏడిపించేశావయ్యా.. నాగ చైతన్య- సమంతలపై ఈ వీడియోలు చూశారా?

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. సమంత దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇదే పని సామ్ చేసి ఉంటే అందరూ ఏమనేవారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజమే.. చైతూ హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదే సమంత ఎవరితోనైనా కొత్త జీవితం మొదలుపెట్టుంటే ఆమె గురించి ఏ రేంజ్‌లో పోస్టులు పెట్టేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యాన్స్‌లో కూడా చాలా …

Read More »

వైసీపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు కూతుళ్ల నిరసన.. మరో మహిళతో సహజీవనంపై నిరసన!

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు.. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్‌ మోగించినా లోపలున్నవారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని.. లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు …

Read More »

నెలకు రూ. 3 వేలు చాలు.. ఇలా చేతికి రూ. 34 లక్షలు.. వడ్డీ లేకుండానే రూ. 30 లక్షల లోన్!

SIP Calculator: స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఉంటంటాయి. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో సెన్సెక్స్ రోజుకు 1000, 2000 పాయింట్ల మధ్య కూడా హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఒక్కసారిగా పడిపోవడం.. మళీ 2-3 రోజుల్లోనే కోలుకోవడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తం లేదా షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందికరమని చెప్పొచ్చు. ఇదే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్లలో చూసినట్లయితే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ …

Read More »

ఉద్యోగులకు పే స్కేల్‌ తగ్గింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షనాత్మక చర్యలతో సమానమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, ఇది తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మాధవన్‌ల ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పే స్కేలును తగ్గిస్తూ అక్టోబరు 2009లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఈ మేరకు ధర్మాసనం రద్దుచేసింది. రిటైర్డ్ …

Read More »

మా శత్రువుకు సాయం చేస్తే భారత్‌తో సహకారం కష్టమే.. బీఎన్పీ

షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …

Read More »