Blog Layout

పలాస: యువకుడు ఒకసారి మిస్.. నిమిషాల్లో రెండోసారి చావు తప్పలేదు

శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే రైలు కిందకు దూకడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కాపాడారు.. మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ యువకుడు ఉదయం 7 గంటల సమయంలో.. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులో నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్‌ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు. ఆ ఘటనలో యువకుడి తలకు …

Read More »

ఏపీలో ఓ వ్యక్తి అతి తెలివి.. ఏకంగా 155 మద్యం షాపులకు దరఖాస్తు, ఒక్కడే ఎంత ఖర్చు చేశారో తెలుసా!

ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ జరుగుతోంది. విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అతి తెలివితో 155 మద్యం షాప్‌లకు గాను 155 షాపులకు దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు⁠ 23 షాపులకు లాటరీ పూర్తికాగా.. ఒక్క షాపు కూడా రాలేదు. ఆయన తనను అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క షాపైనా తనకు రాకపోదా అని ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కో షాపుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్ల 10 లక్షలతో …

Read More »

విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, రికార్డ్ బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 …

Read More »

జిగ్రా విషయంలో ఏం జరుగుతోంది.. నిర్మాత భార్యపై కరణ్ కౌంటర్లు

కరణ్ జోహర్ నిర్మించిన జిగ్రా మూవీతో అలియా భట్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జిగ్రా చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ఓ వైపు శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలియా భట్ జిగ్రా మూవీ డిజాస్టర్‌గా నిలిచేట్టుంది. అలియా భట్ జిగ్రా మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ నార్త్ ఆడియెన్స్‌కి కూడా ఎక్కలేదు. తెలుగులో భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ తెలుగులో జిగ్రాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అన్ని చోట్ల థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. …

Read More »

HYD నగరంలో అతిపెద్ద అండర్‌పాస్.. ఆ ఏరియాలోనే, ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే నగరం రూపరేఖలు మారిపోయాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని నిర్మిచంగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణానికి సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోనే అతిపెద్ద అండర్‌పాస్‌ను నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్నారు. పార్క్ చుట్టూ సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా ప్రభుత్వం ఈ అండర్‌పాస్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్ గేటు వైపు దాదాపు …

Read More »

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ ఛాన్స్.. అదొక్కటే ఛాన్స్

ఆట ఏదైనా.. భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పటికీ దాయాదులే. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి వస్తుందని. కానీ వచ్చింది.. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తన చివరి లీగ్ దశ మ్యాచులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఇప్పటికీ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది. అదేలా అంటే.. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ …

Read More »

ముంబయి- న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన …

Read More »

అరకు వెళ్లే పర్యాటకులకు అద్భుతమైన అవకాశం.. ఊటీ రేంజ్‌లో థ్రిల్, ఆ రెండు సరికొత్త అనుభూతులు

ఆంద్రప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రా ఊటీగా పిలిచే అరకులో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పద్మాపురం ఉద్యానంలో హాట్‌ బెలూన్‌‌ను సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ట్రయల్‌రన్‌ని నిర్వహించారు. అరకు లోయకి ఏటా సుమారు మూడు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారన్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అభిషేక్‌. అందుకే హాట్‌బెలూన్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. హాట్‌ బెలూన్‌ పర్ాయటకులను సుమారు 300 …

Read More »

వారికి మోదీ మరో శుభవార్త.. ఆయుష్మాన్ భారత్‌‌లోకి మరిన్ని ప్యాకేజీలు..!

‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)’ పథకాన్ని 70 ఏళ్ల దాటిన వృద్ధులకు వర్తింప జేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ …

Read More »

సుకన్య సమృద్ధి, PPF స్కీమ్స్ కొత్త వడ్డీ రేట్లు.. కేంద్రం ప్రకటన.. ఫుల్ లిస్ట్ ఇదే!

Small Savings Schemes: పోస్టాఫీసు ద్వారా అందిస్తోన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలైన సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది కేంద్రం. అక్టోబర్- డిసెంబర్ 2024 త్రైమాసికానికి గానూ పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. వరుసగా మూడోసారి కీలక వడ్డ రేట్లను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. అయితే, ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో కోత పెడుతుందన్న అంచనాలతో చిన్న మొత్తాల పొదుపు …

Read More »