Blog Layout

 మళ్లీ తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. నిధిపై రెండో విడత సర్వే

Puri Jagannath Temple: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. ఇప్పటికే కొన్ని నెలల క్రితం పూరీ ఆలయంలో తొలి విడత సర్వే నిర్వహించగా.. తాజాగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ-ఏఎస్‌ఐ అధికారులు శనివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సర్వేలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేవతల దర్శనం కోసం వచ్చే భక్తులను నిలిపివేయనున్నారు. ఒడిశా రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాలను వెలికితీయడం, సంపద …

Read More »

తిరుపతి లడ్డూ వివాదం వేళ.. తిరుమలలో మహాశాంతి యాగం!

తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శనివారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి వాడారన్న వార్తల నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఏం చేయాలనే దానిపై చర్చించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో తిరుమలలో …

Read More »

హైదరాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కూల్చివేతలు.. కూకట్‌పల్లిలోని ఆక్రమణలపై బుల్డోజర్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా.. నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా.. కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్లచెరువు మెుత్తం విస్తీర్ణం మెుత్తం 27 ఎకరాలు కాగా.. 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే బుల్డోజర్లతో …

Read More »

తిరుమల శ్రీవారే నాతో నిజాలు చెప్పించారు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 తిరుపతి లడ్డూ తయారీ గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ఆయనే తనతో చెప్పించారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి కల్తీ ఘటనలు జరగకుండా.. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఈ విషయం విని తీవ్ర …

Read More »

తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మరో రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ముడిపదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మరో రెండున్నర వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే రూ.500 కోట్లు మంజూరు చేయగా.. వాటితో పాటుగా మరో రెండున్నర వేలకోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన …

Read More »

LIC సంచలన నిర్ణయం.. ఇక రోజుకు రూ.100 చాలు.. అక్టోబర్ 7లోపే అమలులోకి!

LIC: ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చిన్న మదుపరులను ఆకర్షించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పెట్టుబడిదారులకు తమ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. త్వరలోనే రోజుకు రూ.100తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ రవి కుమార్ …

Read More »

దేవరకు ప్రభుత్వ అనుమతులు.. సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు

దేవర సినిమాకు ఏపీ ప్రభుత్వం కోరినంత, కావాల్సినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చింది. మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున ఆరు షోలు పడతాయి. ఆ తరువాత ఐదు షోలు ఉంటాయి. తొమ్మిది రోజుల పాటు పెరిగిన రేట్లు, అదనపు షోలతో దేవర ఏపీలో రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది. తమ సినిమాకు ఇన్ని వెసులు బాట్లు కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్‌గా థాంక్స్ …

Read More »

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక రైలు పొడిగింపు, ఈ రూట్‌లోనే

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ప్రత్యేక రైలును డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోలాపూర్‌-తిరుపతి-సోలాపూర్‌(01437/01438) మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు రాయలసీమ మీదుగా నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు గడువును డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ సోలాపూర్‌-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా.. ట్రైన్‌ ఆన్‌ డిమాండ్‌ ఉండడంతో డిసెంబరు 26వ తేదీ వరకు.. తిరుపతి- సోలాపూర్‌ నడుమ (04138) …

Read More »

మీరు మీ హద్దుల్లో ఉండండి.. ప్రకాష్ రాజ్‌కు విష్ణు మంచు వార్నింగ్

తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ, తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసేలా, భక్తుల మనోభవాలు దెబ్బ తీసేలా వ్యవహరించిందని, లడ్డూ తయారికి నాసిరకం నెయ్యిని.. జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్‌తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని.. జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ …

Read More »