ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైఎస్సార్సీపీ హయాంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. 2014-2019 టీడీపీ హయాంలో మహిళా పోలీస్ స్టేషన్లు ఉండేవి.. జగన్ సర్కార్ వాటిని దిశ పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చింది. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దిశ చట్టానికి కేంద్రం …
Read More »Blog Layout
గచ్చిబౌలిలో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్యూటీషియన్ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడిచేసి.. ప్రాణాలు తీశాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులు గాయపడ్డారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటకలోని బీదర్కు చెందిన నిందితుడు రాకేశ్, మాదాపూర్లోని ఓ ప్రయివేట్ హాస్టల్లో ఉంటున్నాడు. పశ్చిమ్ బెంగాల్కు చెందిన దీపన తమాంగ్ (25) అనే యువతి …
Read More »అంబానీ రిలయన్స్ కంపెనీ కీలక ప్రకటన.. 100 షేర్లకు మరో 100 షేర్లు ఫ్రీ.. దూసుకెళ్లిన స్టాక్!
భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భారత అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దీనికి యజమాని. ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా ఇలా ఎన్నో రంగాల్లో తన కార్యకలాపాల్ని విస్తరించి అగ్రపంథాన కొనసాగుతున్నారు. 100 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తి ఈయనకు ఉంది. ఇక గురువారం రోజు రిలయన్స్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం వేళ కీలక ప్రకటనలు వచ్చాయి. సమావేశానికి ముందుగానే.. బోనస్ షేర్ల జారీ గురించి సమాచారం అందింది. ఈసారి 1:1 …
Read More »ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావంతో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.. ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం రెండురోజుల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు …
Read More »ఆ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారా.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్.. కారణం ఇదే..
Stock Market News: చిన్న, మధ్య తరహా కంపెనీల (SME IPO) ఐపీఓల్లో, షేర్లలో పెట్టుబడులకు సంబంధించి.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మదుపరులకు వార్నింగ్ ఇచ్చింది. వీటిల్లో పెట్టుబడుల విషయంలో అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. సదరు కంపెనీలు.. తమ కార్యకలాపాలపై అవాస్తవాల్ని ప్రచారం చేసి.. షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఇటీవలి కాలంలో.. స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయిన తర్వాత.. కొన్ని …
Read More »ఏపీ కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రస్తావన.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్ డే అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబరు ఒకటో తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లవుతోందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబరు …
Read More »హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!
రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి …
Read More »వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 29, 2024): మేష రాశికి చెందిన వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఇష్టమైన బంధువులను, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్క దిద్దడం …
Read More »ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. మంత్రులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇన్నాళ్లు పార్టీ నిర్మించుకున్న మంచిపేరును కొందరు ఎమ్మెల్యేలు దెబ్బతీస్తున్నారని మంత్రులతో అన్నారు. ఆ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు పేపర్లలో వస్తున్నాయని ప్రస్తావించిన చంద్రబాబు.. వారికి వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యేల పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు విచారం వ్యక్తం చేవారు. ఇదే సమయంలో మంత్రులు కూడా …
Read More »తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. చెన్నై భక్తుడు పెద్ద మనసుతో, కొండపై పరిశుభ్రత కోసం
తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన సంస్థ లారీని విరాళంగా అందజేసింది. చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కార్తీక్ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, …
Read More »