ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికీ పాలు, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని …
Read More »TimeLine Layout
September, 2024
-
4 September
ఏపీలో వరద బాధితులకు భారీ విరాళం.. ఏకంగా రూ.120 కోట్లు
ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రంగాలకు అతీతంగా వీఐపీలు, వీవీఐపీలు తమకు తోచిన రీతిలో బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, విశ్వక్ సేన్ వంటి హీరోలతో పాటుగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. అశ్వనీదత్ వంటి నిర్మాతలు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి విరాళాలు కూడా అందించారు. అయితే తాజాగా …
Read More » -
4 September
ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని.. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో వరద వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని చెప్పారు. ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే …
Read More » -
4 September
వరదల్లో ప్రాణనష్టం తగ్గించడంలో విఫలం.. 30 మంది అధికారులకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ప్రపంచం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటోంది. విచిత్రమైన నిబంధనలు, కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సైతం ఆయనే నిర్ణయిస్తారు. ఏం తినాలి.. ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనేది నియంతే శాసిస్తారు. కఠినమైన ఆంక్షలతో పాటు.. చిన్న చిన్న తప్పిదాలకే దారుణమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఇటీవల ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు కిమ్ సిద్ధమయ్యారు. …
Read More » -
4 September
విశాఖ ఎయిర్పోర్టులో హైడ్రామా.. ఫోన్ కాల్తో ఆగిపోయిన విమానం, ఎంత పని చేశావు నాయనా!
విశాఖపట్నం ఎయిర్పోర్టులో హైడ్రామా నడిచింది. ఒక ఫోన్ కాల్తో విమానం ఆగిపోగా.. అధికారులు, భద్రతా సిబ్బంది కొద్దిసేపు పరుగులు పెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు.. ఆ విమానం ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. సీన్ కట్ చేస్తే.. విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడి విమానాన్ని కాసేపు ఆపేందుకు ఇలా చేసినట్లు తేలింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరింది. అక్కడ విమానం ఎక్కాల్సిన ఒక ప్రయాణికుడు సమయానికి చేరుకోలేకపోయాడు. ఎలాగైనా …
Read More » -
4 September
ఏపీ, తెలంగాణకు నారా భువనేశ్వరి భారీ విరాళం.. హెరిటేజ్ తరఫున కళ్లు చెదిరే మొత్తం
ఆంధ్రప్రదేశ్కు వర్షం, వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిపడింది. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి దయనీయంగా ఉంది.. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. రాష్ట్రంలో పరిస్థితుల్ని చూసిన ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నాయి.. కొందరు విరాళాలు ప్రకటిస్తుంటే.. మరికొందరు ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి భారీగా …
Read More » -
4 September
మాజీ ప్రిన్సిపల్ భారీ కుట్రదారు.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు
కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సందీప్ ఘోష్పై సీబీఐ తరఫు లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తవ్వితీయాల్సిన అవసరం ఉందని వివరించారు. సందీప్ ఘోష్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన …
Read More » -
4 September
యాచారం ఫార్మాసిటీ ఉన్నట్లా? లేనట్లా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు భూసేకరణ కూడా చేపట్టింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ టౌన్షిప్లు అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఈ ఫార్మా భూములు విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఫార్మాసిటీ ఉన్నట్లా..? …
Read More » -
4 September
విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్
విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక …
Read More » -
4 September
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎదురు దెబ్బ.. అన్నంత పనిచేసిన చంద్రబాబు సర్కార్
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు సర్కార్ షాకిచ్చింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పినట్లుగానే జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు వస్తున్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు.. సీఆర్జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని.. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు చెబుతున్నారు. భీమిలిలోని సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన …
Read More »