తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తుండటంతో చాలా మంది ఓయో రూమ్స్ వినియోగిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారు ఓయో రూముల్లో స్టే చేస్తూ తమ పనులు ముగించుకుంటున్నారు. ఇక యువత కూడా ఓయో రూములను ఎక్కవగా వినియోగిస్తుున్నారు. అయితే ఈ ఓయో రూమ్స్ తీసుకునే జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలు ఏకాంతంగా గడిపే వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఆపై డబ్బులు డిమాండ్ …
Read More »TimeLine Layout
August, 2024
-
28 August
వైసీపీకి బిగ్ షాక్, ఎంపీ రాజీనామా?.. టీడీపీలో చేరాలని నిర్ణయం!
వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మరో ముఖ్యమైన నేత ఆ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గురువారం ఆ పార్టీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్లు చేశారు. మోపిదేవి చూపు తెలుగు దేశం పార్టీ వైపు ఉందని.. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మోదలయ్యాయి. మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవితో పాటుగా బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవి కూడా …
Read More » -
28 August
కొత్త రేషన్ షాపుల ఏర్పాటు.. రివర్స్ టెండరింగ్, ఎస్ఈబీ రద్దు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు.. మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఓకే చెప్పగా.. ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు …
Read More » -
28 August
శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలంరేపాయి. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము 3.42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు కొందరు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని.. అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని.. శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. రెండేళ్ల క్రితం అక్టోబర్లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. వాటితో పోల్చితే నేడు వచ్చినవి …
Read More » -
28 August
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై నో సీక్రెట్, ఈ నెల 29 నుంచి ప్రజలకు అందుబాటులో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిచింది.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీవోనూ జీవోఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.. వారు స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు. జీవోఐఆర్ పోర్టల్కు సంబంధించి సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్లోనూ జీవోలకు మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించేవారు. కచ్చితంగా వాటిలో నంబరు రాసి, జీవోలు విడుదల …
Read More » -
28 August
ఏపీలో రేషన్కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి కూడా పంపిణీ, వచ్చే నెల పక్కా
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతోంది.. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.. రెండు నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం …
Read More » -
28 August
ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంపు
ఆంధ్రప్రదేశ్లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. రూ.50వేలకుపైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెలా రూ.10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,683 మంది లబ్ధిపొందనున్నారు. అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని కూడా సూచించారు. …
Read More » -
28 August
కేంద్రం గుడ్న్యూస్.. మరో 3 కోట్ల మందికి ఆ స్కీమ్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు!
JanDhan: సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జన్ధన్ యోజనకు శ్రీకారం చుట్టింది. 2014, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బ్యాంకు సేవలు అందని వారికి, వెనకబడిన వర్గాలకు దీని ద్వారా బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని, లోన్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ ఖాతాలు తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత …
Read More » -
28 August
ఏపీలో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు బంపరాఫర్..
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని.. పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన)లో భాగంగా …
Read More » -
28 August
కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 28, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధనపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సవ్యంగా సాగిపోతాయి. …
Read More »