TimeLine Layout

August, 2024

  • 15 August

    మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక.. ప్రతి నెలా ఒకరోజు నెలసరి సెలవు

    Odisha Govt Announced menstrual leave: నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే సాటి మహిళలే వాటిని అర్థం చేసుకోగలరు. పైపెచ్చు ఉద్యోగం చేసే వారయితే ఆ సమయంలో వచ్చే చిరాకుకు తోడు పని ఒత్తిడి వారిని మరింత చికాకు పెడుతూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని ఉద్యోగినులకు ఆ …

    Read More »
  • 15 August

    బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్లు అప్పు చేసిన కుమారుడు.. తీర్చలేక తల్లిదండ్రుల బలవన్మరణం

    ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు. వంశాన్ని నిలబెట్టే వారసుడని.. తమను పున్నామ నరకం నుంచి గట్టెక్కించే పుత్రుడని ఆశలు పెంచుకున్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. అతి గారాబమే తమ పాలిట మృత్యుపాశమవుతుందని.. కన్న కొడుకే తమ చావుకు కారణమవుతాడని.. పాపం ఆ వెర్రి తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మంచి చదువులు చదివించి ప్రయోజకుడిని చేద్దామని భావించిన ఆ కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. చిన్నప్పటి నుంచి గారబంగా పెరిగిన ఆ కొడుకు.. వ్యసనాలకు బానిసయ్యాడు. బెట్టింగులకు బానిసగా మారి కోట్ల రూపాయలు …

    Read More »
  • 15 August

    అన్న క్యాంటీన్లకు ఆ రోజు సెలవు.. వడ్డించే ఐటెమ్స్ ఇవే.. ఆహార పరిమాణం ఎంతంటే?

    ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. పేదల కడుపు నింపాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు మూతపడగా.. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అన్న క్యాంటీన్లు తీసుకువచ్చారు. గురవారం పంద్రాగస్టు సందర్భంగా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఆగస్ట్ 16న రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాలలో ఉన్న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, …

    Read More »
  • 15 August

    హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!

    హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …

    Read More »
  • 15 August

    పవన్ కళ్యాణ్ -ఆద్యల క్యూట్ ఫొటో.. రేణూ దేశాయ్ రియాక్షన్ వైరల్

    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కుమార్తె ఆద్య కూడా హాజరైంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్‌ తన కూతురితో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోపైనే రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆద్య అర్థం చేసుకుంటుంది “స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో …

    Read More »
  • 15 August

    సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో ఇక్కడ కూడా, ఇకపై ఈజీగా

    సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో దిగ్విజయంగా కొనసాగుతున్న నిత్య అన్నప్రసాద పథకానికి విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకు డిజిటల్‌ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సింహాద్రి అప్పన్న స్వామి నిత్యాన్నప్రసాద పథకం 35వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నప్రసాద పథకానికి సాధారణ భక్తులు సైతం విరాళాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. సింహాచలం ఆలయం అన్నదానం భవనం దగ్గర కార్డు స్వైపింగ్‌ పరికరాలు, డిజిటల్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. …

    Read More »
  • 15 August

    ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లాభాలే కాదు.. ఈ నష్టాలూ ఉంటాయి? చూసుకోండి మరి!

    Bank FD: రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి బ్యాంక్ డిపాజిట్లు సరైన ఎంపికగా చెబుతుంటారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Bank Deposits) పథకాలు కల్పిస్తాయి. పోస్టాఫీసులోనూ ప్రస్తుతం మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. అందుకే ఇటీవలి కాలంలో చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ టెన్యూర్లను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి బ్యాంకులు. ప్రస్తుతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కనిపించే లాభాలే కాదు.. కనిపించని నష్టాలు …

    Read More »
  • 15 August

    ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు

    ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో …

    Read More »
  • 15 August

    కోల్‌కతాలో అర్ధరాత్రి అనూహ్య పరిణామం.. వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రి ధ్వంసం

    కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం’ పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. డజన్లుకొద్దీ గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడే …

    Read More »
  • 15 August

    తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు

    తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత కాసుల వర్షం కురిసింది. కొన్ని నెలల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది.. చాన్నాళ్లకు స్వామివారి హుండీ ఆదాయం ఒక్క రోజులో రూ.5కోట్ల మార్కును దాటేసింది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,967మంది భక్తులు దర్శించుకున్నారు.. 32,421మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే 5.26 కోట్లు ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టికెట్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 …

    Read More »