ఏపీలో మరోసారి వాన ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఈనెల 22నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదంటున్నారు. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా కదులుతూ.. ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చొని చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్పష్టత వస్తుందని చెబుతుంది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో …
Read More »TimeLine Layout
October, 2024
-
19 October
ఏపీలో ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంపు.. ఇకపై వారంలో ఆరు రోజులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి.. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే వారికి వారంలో ఆరు రోజులపాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్లు) ఇచ్చేందుకూ ఓకే చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు చంద్రబాబు. …
Read More » -
19 October
AP Cabinet: వారం రోజుల గ్యాప్లో రెండోసారి భేటీ.. ఈ సారి ఆ నిర్ణయం పక్కా!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 23వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాయం వేదికగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ విషయమై అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ లేఖలు రాశారు. ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు మంత్రివర్గ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని లేఖలో సూచించారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీ ఇటీవలే జరిగింది. …
Read More » -
19 October
టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ఈ చిన్న పని చేస్తే చాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నలుగురు ఓటర్లలో ఒకర్ని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు.. దీని కోసం రూ.లక్ష రుసుంగా నిర్ణయించామన్నారు. ఒకవేళ పార్టీ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమా మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అంతేకాదు చనిపోయిన కార్యకర్తల …
Read More » -
19 October
ఏపీలో మందుబాబులకు మరో షాక్.. ఇక లేనట్లేనా?, వాళ్లకు పండగే!
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్ రూమ్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పెట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ నిర్ణయం బార్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది.. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో …
Read More » -
18 October
అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు పొందొచ్చు.. గూగుల్లో కొత్త ఫీచర్ వచ్చేసింది.. వివరాలివే!
Flight Tickets : అతి తక్కువ ధరకే విమాన టికెట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లకి శుభవార్త. ఇలాంటి వాళ్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. గూగుల్ ఫ్లైట్స్లో ఇప్పుడు మీరు తక్కువ ధరతో కూడిన విమాన టికెట్లను సెలక్ట్ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.. అతి తక్కువ ధరలకు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇప్పుడు గూగుల్ మీకోసం కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సూపర్ చీప్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ మీ టూల్కిట్లో …
Read More » -
18 October
వయనాడ్ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం?
Khushboo: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా …
Read More » -
18 October
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మీ ఖాతా అడ్రస్ మార్చారా? చూసుకోండి మరి
Banking: బ్యాంక్ అకౌంట్ తీసుకున్ని సంవత్సరాలు గడుస్తుంటుంది. కొందరికి ఒకటికి మించి అకౌంట్లు ఉంటాయి. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఇలా చిరునామా మారినప్పటికీ బ్యాంక్ ఖాతాలో మాత్రం పాత అడ్రస్ కొనసాగిస్తుంటారు. ఇలా చేయడం పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. మీరు చిరునామా మారినప్పుడల్లా బ్యాంక్ అకౌంట్లోనూ వివరాలను అప్డేట్ చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంక్ అకౌంట్ కీలకమైనది. ఇందులో మన అడ్రస్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలనూ ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. …
Read More » -
18 October
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అద్భుత అవకాశం.. వెంటనే దరఖాస్తు చేస్కోండి, 25 వరకే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టీచర్లకు ముఖ్యమైన గమనిక. ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి)లో డిప్యుటేషన్పై పనిచేసే పోస్టులకు దరఖాస్తు చేసేందుకు పురపాలక ఉపాధ్యాయులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ పోస్టులకు సంబంధించి.. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని వారికే మొదట అవకాశం కల్పించారు. ఇటు పురపాలక టీచర్లకూ డిప్యుటేషన్ ఇవ్వాలని విన్నవించడంతో.. ఈ మేరకు వారికి కూడా అనుమతి ఇచ్చారు. విద్యా శాఖ ఎస్సీఈఆర్టీలో 34 పోస్టులను డిప్యుటేషన్పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. …
Read More » -
18 October
విశాఖలో ఓ అపార్ట్మెంట్లో గుట్టుగా.. పోలీసులు డోర్ తీయగానే, అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయారు
విశాఖపట్నంలో సరికొత్త దందా బయటపడింది. నగరంలో కాస్మొటిక్స్ అమ్మకాల ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్, ఇతర ఆన్లైన్ మోసాలు చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా ఈ తతంగం మొత్తం నడుస్తుండగా.. విశాఖ సైబర్ క్రైమ్, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ గ్యాంగ్ చైనా కేంద్రంగా నడిచే ఆన్లైన్ బెట్టింగ్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు చెబుతున్న వివరాల ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంకు చెందిన సూర్యమోహన్ హాంకాంగ్, తైవాన్కు వెళ్లొచ్చారు. అనంతరం నగరానికి చెందిన సాయిరామ్, గిరిష్లతో …
Read More »