శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలంరేపాయి. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము 3.42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు కొందరు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని.. అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని.. శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. వాటితో పోల్చితే నేడు వచ్చినవి అత్యల్పమని మరో స్థానికుడు నరసింహమూర్తి అన్నారు. ఈ భూ ప్రకంపనల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *