రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB).. మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
భర్తీ చేసే ఆర్ఆర్బీ రీజియన్లు ఇవే : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్, అజ్మేర్, గోరఖ్పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్కతా, సికింద్రాబాద్, బిలాస్పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు : 1376
- డైటీషియన్ (లెవల్-7) పోస్టులు : 05
- నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు : 713
- అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04
- క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు : 07
- డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు : 03
- డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 20
- హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-III పోస్టులు : 126
- ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు : 27
- పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు : 02
- ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు : 20
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు : 02
- క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు : 02
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు : 246
- రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు : 64
- స్పీచ్ థెరపిస్ట్ పోస్టు : 01
- కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04
- ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13
- ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94
- ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19