Tag Archives: andhra pradesh

అన్న క్యాంటీన్లకు ప్రతి ఏటా రూ.కోటి ఇస్తానన్న ప్రముఖ వ్యాపారి.. ఆయనకు రూ.100 కోట్లు ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరారు.. వీరి కోసం ప్రత్యేకంగా అకౌంట్ నంబర్ ప్రారంభించారు. ఎస్‌బీఐ ఖాతా నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. అన్న క్యాంటీన్ల కోసం …

Read More »

మాజీ మంత్రి రోజాకు చిక్కులు.. రంగంలోకి సీఐడీ, ఆ మాజీ మంత్రి కూడా!

మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు.. గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్‌ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు …

Read More »

రేపే అన్న క్యాంటీన్ల ప్రారంభం.. నారా భువనేశ్వరి భారీ విరాళం.. ఎంతో తెలుసా?

Nara Bhuvaneswari Donation for Anna canteens: పంద్రాగస్టును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ …

Read More »

దీనిపై కఠినంగా ఉండండి: చంద్రబాబు

జీవో 117పై నివేదిక ఇవ్వండి విద్యార్థులకు స్పోర్ట్స్‌ రిపోర్టులు ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా ఐడీ విద్యాశాఖలో సమూల మార్పులు సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి: విద్యా శాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబ్‌సలో మార్పులు చేయాలని సూచించారు. దీనికోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ప్రముఖులతో …

Read More »

ఏపీ అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదే.. టైమింగ్స్‌తో సహా వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న (గురువారం) అన్న క్యాంటీన్‌ను కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద …

Read More »

ఏపీలో రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, రాయితీపై తక్కువకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు మళ్లీ వ్యక్తిగత రాయితీపై యంత్రపరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు ట్రాక్టర్లు, పవర్‌స్ప్రేయర్లు, టార్పాలిన్లు, యంత్ర పరికరాలెన్నో రాయితీపై అందించనున్నారు. అలాగే ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఆదరణ చూపిస్తున్ారు.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతోపాటు …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …

Read More »

విజయవాడ దుర్గమ్మ భక్తులకు అదిరే ఆఫర్.. ఉచితంగానే, వెంటనే దరఖాస్తు చేస్కోండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో రామరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్‌ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తుమన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్‌కు 500 మందికి మాత్రమే అనుమతి …

Read More »

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్క‌డ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోగా ఇవ్వాలని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాల‌యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితాను తయారీని ఎటువంటి రాజకీయం ఒత్తిడి …

Read More »