Uncategorized

భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్

అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆయన భార్య భారతి కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యే కాలంలో జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే విమానంలోని తోటి ప్రయాణికుడు ఒకరు ఈ ఫొటో తీశారు. అధికారంలో ఉండగా.. ప్రజల్లోకి రావాలంటేనే జంకిన జగన్.. ఇప్పుడు సామాన్య పౌరుడిలా తోటి ప్రయాణికులతో కలిసి వెళ్తుండంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజల్లోకి వస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని హితవు పలుకుతున్నారు.

కాగా ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు సీఎం హోదాలో ఆయన ప్రత్యేక విమానాల్లో ప్రయాణించేవారు.. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోగానే సామాన్యుడిలా ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ విమానంలో కన్పించడంతో చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button