కేంద్రంలో టీడీపీ ఎంపీకి కీలక పదవి.. మరో బీజేపీ ఎంపీకి అవకాశం

ఏపీలో కూటమికి చెందిన ఇద్దరు ఎంపీలకు రెండు కీలకమైన పదవులు దక్కాయి. ఇద్దరికి పార్లమెంటు స్థాయీసంఘాల ఛైర్మన్‌ పదవులు దక్కాయి. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయీసంఘం ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నియమించారు. రైల్వేశాఖ స్థాయీసంఘం ఛైర్మన్‌గా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ను విడుదల చేసింది. అలాగే పర్యాటక, రవాణా, సాంస్కృతిక స్థాయీసంఘం ఛైర్మన్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి ఆ పదవి కోల్పోయారు. టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ రక్షణ, హోంశాఖ కమిటీల్లో, జనసేన ఎంపీ బాలశౌరిలు ఆర్థికం, పెట్రోలియం స్థాయీ సంఘాల కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. మరికొందరు టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా పలు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.

మరోవైపు మరికొన్ని స్థాయి సంఘాల కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు స్థానం దక్కింది. రైల్వే- కె.లక్ష్మణ్‌.. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు- చామల కిరణ్‌.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: కడియం కావ్య.. వాణిజ్యం – రేణుకాచౌదరి.. పరిశ్రమలు- ధర్మపురి అర్వింద్, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, న్యాయశాఖ- కేఆర్‌ సురేష్‌రెడ్డి, రఘునందన్‌రావు.. శాస్త్ర, సాంకేతికం, అటవీ, పర్యావరణం- డి.దామోదర్‌రావు, వంశీకృష్ణ.. రవాణా, పర్యాటకం, సాంస్కృతికం- సురేశ్‌ షెట్కార్‌.. ఎరువులు, రసాయనాలు- బలరాంనాయక్, ఈటల రాజేందర్‌.. బొగ్గు, గనులు, ఉక్కు – అనిల్‌కుమార్.. కమ్యూనికేషన్లు, ఐటీ – ఆర్‌.రఘురాంరెడ్డి.. ఇంధనం- రఘువీర్‌ రెడ్డి.. విదేశాంగ వ్యవహారాలు- కె.లక్ష్మణ్, అసదుద్దీన్‌ ఒవైసీ, డీకే అరుణ.. పెట్రోలియం, సహజవాయువు- వద్దిరాజు రవిచంద్ర.. సామాజిక న్యాయం, సాధికారత- గోడం నగేశ్‌‌లకు స్థానం దక్కింది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *