Uncategorized

ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పిడుగులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది.. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 14వ తేదీ వరకు నేరుగా వాయుగుండంగా.. 15 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనుందని భావిస్తున్నారు. ఇది 15వ తేదీన తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుంది.. రాష్ట్రవ్యాప్తంగా 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అక్డోబర్ 11న భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుంభవృష్టికి అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ 12న పిడుగులతో కూడిన కుంభవృష్టి.. అక్టోబర్ 13న పిడుగులతో పాటూ భారీ వర్షాలు పడతాయంటున్నారు. అక్టోబర్ 14న భారీ వర్షం, పిడుగులతో కూడిన భారీగా వానలు.. అక్టోబర్ 15న అతి భారీ వర్షం తోపాటు పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్‌లు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఏపీపై ఉంటుందని భావిస్తున్నారు. కాకపోతే ఈ తుఫాన్‌లపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button