Uncategorized

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లోనే.. టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. ఏపీలో ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా ,అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు భారీ వర్షాలు కురవొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలలో కలెక్టర్లు అలర్ట్‌గా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. అన్నిచోట్ల కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని.. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనడానికి పూర్తి సన్నద్దంగా ఉండాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button