Uncategorized

ఏపీలో జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రుల నియామకం.. ఆ ఇద్దరికి బాధ్యతలు ఇవ్వలేదు, చంద్రబాబు జిల్లాకు ఎవరంటే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. 26 జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రుల్ని నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల్ని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా – కొండపల్లి శ్రీనివాస్
అల్లూరి సీతారామరాజు జిల్లా – గుమ్మడి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
విజయనగరం జిల్లా – వంగలపూడి అనిత
విశాఖపట్నం జిల్లా – డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
అనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్ర
కాకినాడ జిల్లా – పొంగూరు నారాయణ
తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు – నిమ్మల రామానాయుడు
పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్
ఏలూరు జిల్లా – నాదెండ్ల మనోహర్
కృష్ణా జిల్లా – వాసంశెట్టి సుభాష్
ఎన్టీఆర్ జిల్లా – సత్యకుమార్ యాదవ్
ప్రకాశం జిల్లా – ఆనం రామనారాయణరెడ్డి
తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్
చిత్తూరు జిల్లా – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గుంటూరు జిల్లా – కందుల దుర్గేష
బాపట్ల జిల్లా – కొలుసు పార్థసారథి
నెల్లూరు జిల్లా – ఎన్‌ఎండీ ఫరూఖ్
కడప జిల్లా – సవిత
అన్నమయ్య జిల్లా – బీసీ జనార్థర్ రెడ్డి
నంద్యాల జిల్లా – పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా – టీజీ భరత్

ఏపీ కేబినెట్‌లో మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు. సాధారణంగా అందరు మంత్రులకు జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక కారణాలతో లోకేష్, పవన్ కళ్యాణ్‌లలను ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే యువ మంత్రులకు కీలకమైన జిల్లాల బాధ్యతలు అప్పగించడం విశేషం. మండిపల్లా రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు బాధ్యతలు ఇచ్చారు. అలాగే కృష్ణా జిల్లా బాధ్యతల్ని మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు అప్పగించింది ప్రభుత్వం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button