మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మనుసులు గెలుచుకున్నారు. తెలంగాణ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేసిన కృషితో పాటు.. భారత్‌లో ఆర్చరీ క్రీడకు తిరుగులేని మద్దతును అందించినందుకు మా నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ డాడ్..” అంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. కాగా.. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే.. మెగస్టార్ కోడలిగా.. రాంచరణ్ భార్యగానే కాకుండా.. ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు ఉపాసన. కాగా.. రాంచరణ్ భార్య కావటంతో.. ఉపాసనను మెగా అభిమానులు వదినమ్మ అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. అపోలో సంస్థల ప్రతినిధిగా.. యువ వ్యాపారవేత్తగా ఉపసాన గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో ఆస్పత్రుల వ్యవహారాల్లో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఉపాసన.. అపోలోను మరింత విస్తరించే పనులు చేపట్టారు. అదేకాకుండా.. మరికొన్ని కొత్తరకాల వ్యాపారాలు ప్రారంభించి, పలు బిజినెస్‌లలో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంపైనే ఉపాసన ఫోకస్ చేస్తున్నారు.

ఇవన్నీ కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఉపాసన యాక్టీవ్‌గా ఉంటూ.. తన ఫాలోవర్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంటారు. తమ లైఫ్‌లో జరిగే.. ముఖ్యమైన సందర్భాల గురించి పోస్టులు, ఫొటోలు పెడుతూ తన అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు.. ఎలాంటి డైట్ తినాలి.. ఎలాంటి వ్యాయామాలు, యోగా చేయాలి.. అంటూ రకరకాల వీడియోలతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా ఉపాసన చేస్తుంటారు. గతంలో.. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిల్లల్లో కూడా డైట్ ప్లాన్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

తాజాగా.. యువ మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపాసన ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన.. హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకుంటున్న వారికి కో ఫౌండర్‌గా ఉంటానని మాట ఇచ్చారు. ఇండియాలో హెల్త్ కేర్ వ్యవస్థను మార్చేందుకు తన వంతు సాయం చేస్తానని చెప్పుకొచ్చారు.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *