Uncategorized

ఏపీలో ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంపు.. ఇకపై వారంలో ఆరు రోజులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి.. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే వారికి వారంలో ఆరు రోజులపాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇచ్చేందుకూ ఓకే చెప్పారు.

కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు చంద్రబాబు. తన దగ్గర పక్కాగా వివరాలు ఉన్నాయని.. కేడర్ సాయంతోనే ఇక్కడున్న ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు.. గెలిచిన వాళ్లు పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. అలా ఉండలేమనుకున్నవాళ్లు స్వతంత్రంగా గెలిచి ఉండాల్సింది అంటూ ఘాటుగా మాట్లాడారు. ఎవరైనా ఎమ్మెల్యే వలలా పార్టీకి, తనకు చెడ్డ పేరు వస్తే సహించేది లేదని.. ఎమ్మెల్యేలు ఎంపీల్ని గౌరవించాలని, ఎంపీలు ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో, సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

గతంలో వైఎస్సార్‌సీపీ పాలనలో దందాల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు చంద్రబాబు. ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పానన్నారు. అంతేకాదు మద్యం విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి.. సీనియర్లకు అందరికీ ఇదే వర్తిస్తుంది అన్నారు. చాలా మంది పనితీరులో ఇంకా మార్పు రావాలన్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలకు మరింత ఎక్కువ మేలు జరగాలి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button