తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. టీటీడీ జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నేడు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జనవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిల‌లో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు టీటీటీ వెబ్‌సైట్ అయిన.. https://ttdevasthanams.ap.gov.in ద్వారా ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాల‌ని సూచించారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *