Uncategorized

ప్రతి సంవత్సరం టిక్కెట్లపై రైల్వే ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా.. లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన

భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణికులకు మొత్తం రూ.56,993 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి టికెట్‌పై రైల్వే దాదాపు 46 శాతం రాయితీ ఇస్తోందని తెలిపారు.

రైల్వే టిక్కెట్లలో తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా, అశ్విని వైష్ణవ్ సభలో మాట్లాడుతూ, భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణీకులకు మొత్తం రూ. 56,993 కోట్ల సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రతి టికెట్‌పై 46 శాతం తగ్గింపు ఇస్తారు. లోక్‌సభలో ఆయన సమాధానం ఇస్తూ.. టికెట్ ధర రూ. 100 అయితే రైల్వే శాఖ మాత్రం రూ.54 మాత్రమే వసూలు చేస్తుందన్నారు. అంటే ప్రయాణీకుడికి 46 శాతం తగ్గింపు లభిస్తుందని స్పష్టం చేశారు.

వేగవంతమైన రైలు సేవలకు సంబంధించిన మరో ప్రశ్నకు అశ్వని వైష్ణవ్ స్పందిస్తూ, రైల్వే ఇప్పటికే భుజ్ – అహ్మదాబాద్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైల్ సేవను ప్రారంభించిందని,దాని మెరుగైన సేవ కారణంగా ప్రయాణీకులలో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు భుజ్ – అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో అధిగమించడం ద్వారా ఇంటర్‌సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని రైల్వే మంత్రి తెలిపారు.

నేటి అధునిక యుగంలో భారతీయ రైల్వే ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన సేవలు అందించడంతోపాటు ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సరసమైన ధరలో సులభమైన ప్రయాణాన్ని అందించడం ప్రభుత్వ మొదటి ప్రయత్నం అన్న ఆయన, అందుకే భారతీయ ప్రజలకు 46 శాతం సబ్సిడీతో సేవలు అందిస్తోందని వెల్లడించారు.

అంతకుముందు, కేరళలో రైల్వే ప్రాజెక్టు కోసం భూసేకరణ నిరసిస్తూ ధర్నాకు కూర్చోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ భావించారు. థరూర్‌ నియోజకవర్గం తిరువనంతపురంలోని నెమోమ్‌ రైల్వే టెర్మినల్‌ ప్రాజెక్టుపై ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వైష్ణవ్‌ ఈ ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో శశిథరూర్ ప్రాజెక్టు జాప్యం, నిధులు సరిపోవడంపై మాట్లాడారు. వైష్ణవ్ స్పందిస్తూ, పెద్ద నగరాలు, జంక్షన్‌లలో రద్దీని తగ్గించడం, కొత్త టెర్మినల్స్ నిర్మించడం, రాబోయే 50 ఏళ్ల డిమాండ్‌లు, అవసరాలకు అనుగుణంగా వాటి రూపకల్పనపై ఎక్కువ దృష్టి పెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వైష్ణవ్ చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button