ఏపీలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం క్లారిటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా పెరిగాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. ఉమ్మడి కడప, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూటమి ఈ డిమాండ్లపై హామీలు ఇచ్చింది. వీటిలో ప్రధానంగా మార్కాపురం కేంద్రంగా, హిందూపురం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. అలాగే రాజంపేటకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త జిల్లాల డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అయితే తాజాగా రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయని.. కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ వైరల్ అవుతోంది. కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కూడా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు జిల్లాలను రద్దు చేయబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *