ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఎలుగుబంటి కనిపించింది. తప్పించుకునే ప్రయత్నంలో రైతులు నానాతంటాలు పడ్డారు. ఎలుగుబంటి రైతుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా రైతులంతా కలిసి గట్టి గట్టిగా అరుస్తూ.. శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాల్లో ఎలుగుబంటిని వెంబడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు …

Read More »

వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు చాలావరకు మారే అవకాశం ఉంది. …

Read More »

బిగ్ బాస్‌లోకి వెళ్లొద్దమ్మా అమృతా ప్రణయ్..?

బిగ్ బాస్ అంటే.. అదో సెలబ్రిటీ షో. ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్న రియాలిటీ షో అని అనేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అదో గబ్బు షో. అక్కడికి వెళ్తే జీవితాలు బాగుపడటం కాదు.. ఉన్న జీవితాలు సర్వ నాశనం అవుతాయి. కొంతమంది ఫేక్ గాళ్లు ఈ షో వల్ల లాభపడి ఉండొచ్చేమో కానీ.. అత్యధిక శాతం మంది మాత్రం.. బిగ్ బాస్‌కి వెళ్లి తమ క్యారెక్టర్‌ని బజారున పెట్టుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. ఒకటి మాత్రం నిజం.. బిగ్ …

Read More »

ఎల్ఆర్ఎస్‌ కొత్త విధివిధానాలు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన “లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం”(LRS) అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలపై తీవ్ర భారం పడనుందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విధివిధానాలు (LRS Guidelines) తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు.. ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సచివాయలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్‌ఎస్ విధివిధానాల‌ కసరత్తుపై సమీక్షించారు. ఎల్‌ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు …

Read More »

సీఎం చంద్రబాబు పెద్ద మనసు.. వారందరికీ రూ.3 వేలు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీరు చేరి భారీగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యారు. దీంతో అక్కడ నివసించే జనజీవనం అస్తవ్యస్తం అయింది. పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలను సహాయక శిబిరాలకు తరలించింది. ఈ క్రమంలోనే వరద ప్రభావానికి గురై.. ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక …

Read More »

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన చూస్తుంటే.. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా.. రివర్స్‌ వెళ్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని.. బాధితులపై కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని.. ఏపీలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు …

Read More »

విజయవాడ దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం.. 15 రోజుల్లో ఎన్ని కోట్లంటే

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయ మహా మండపంలో లెక్కించారు. దుర్గమ్మకు 15 రోజులకుగాను రూ. 2,68,18,540 ఆదాయం నగదు రూపంలో వచ్చింది. అంటే రోజుకు సగటున రూ.17,54,569 మేరకు కానుకలు వచ్చినట్లు లెక్క. నగదులతో పాటుగా 380 గ్రాముల బంగారం, 5కిలోల 540 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయి. 401 ఓమన్ రియాల్స్, 281 అమెరికా డాలర్లు, 110 యూరోలు, 70 అస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లండ్‌ …

Read More »

నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!

ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. నేడు పారిస్‌ వేదికగా ఒలింపింక్స్‌ 2024కు తెరలేవనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. చివరగా పారిస్‌లో 1924లో ఒలింపిక్స్‌ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అక్కడ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోనున్న వేడుకలు.. సాధారణంగా ఎప్పుడైనా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతాయి. …

Read More »

ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా.. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రీసెంట్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్‌కి జోడీగా నటించింది జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా ఇతర డబ్బింగ్ వెర్షన్‌ల గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. థియేటర్లో రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.

Read More »

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం పెరిగిందా.. 

PM Kisan Scheme: దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కూడా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా.. అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు రూ. 6 వేల చొప్పున అందిస్తుంటుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల …

Read More »

సల్మాన్ ఇంటిపై దాడికి ముందు.. షూటర్లకు గ్యాంగ్‌స్టర్ 9 నిమిషాలు మోటివేషన్ స్పీచ్!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్‌ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌‌షీట్‌లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు …

Read More »

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు కేంద్రంం ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైలు మార్గం కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఇప్పటికే నివేదికలు సమర్పించగా.. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించింది.. ఈ కొత్త లైన్‌కు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. ఈ నూతన రైలు మార్గం మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నిర్మాణం జరగబోతోంది. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో …

Read More »

టీటీడీలోకి మరో సీనియర్ అధికారి

టీటీడీలోకి మరో కీలక అధికారి వచ్చారు.. అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాగా.. డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిది. దీంతో ఈ నెల 16న కేంద్రం ఆమోదం తెలపగా.. ఆయన ఈ నెల 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో పాటు తిరుమల జేఈవోగానూ విధులు నిర్వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకయ్య …

Read More »

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత 21 ఏళ్ల తర్వాత ఆర్మీ భారీ ఆపరేషన్

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం భారీ ఆపరేషన్‌కు వ్యూహరచన చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు ఇప్పటికే 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్‌ లోయలో …

Read More »