Uncategorized

161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను కూడా రంగంలోకి దింపారు.

బెల్జియన్‌ మాలినోయిస్‌, లాబ్రడార్‌, జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన స్నిఫర్‌ డాగ్‌లను తీసుకొచ్చారు. ఇవి మానవ అవశేషాలతోపాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసను కూడా పసిగట్టగలవు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌ రీమౌంట్‌ వెటర్నరీ కార్ప్స్‌ సెంటర్‌లో వీటికి చాలా ఏళ్లుగా శిక్షణ ఇచ్చినట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి మేరకు శునకాలను రప్పిస్తున్నామని సైనిక అధికారులు పేర్కొన్నారు. ఇవి శిథిలాల కింద సజీవంగా ఉన్నవారితో పాటు గతంలో కవలప్పారా, పుతుమాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినప్పుడు కూడా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు ఈ జాగిలాలు సహాయం అందించాయని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button