Uncategorized

Allam Vellulli Paste: హైదరాబాదీలు ఉలిక్కిపడే ఘటన.. టన్నులకు టన్నులే.. ప్రముఖ హోటళ్లకు ఈ దరిద్రమే సరఫరా..!?

అమ్మబాబోయ్.. ఇదేందిరా ఇది.. ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా. ఇది కచ్చితంగా హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడాల్సిన ఘటన. జంట నగరాల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలోకి వెళ్లి.. లొట్టలేసుకుంటూ తినే ప్రతిఒక్కరూ ఒక్కక్షణం గుండెను రాయి చేసుకోవాల్సిందే. ఇటీవల పదే పదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ గురించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి.. కల్తీలు జరుగుతున్నాయని.. ఆ కల్తీ సరుకు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తోందని హెచ్చరిస్తే.. మనమేమి అలాంటి కల్తీ సరుకు వాడే హోటళ్లలోకి వెళ్లట్లేదు.. అలాంటి దరిద్రాన్ని వాడే రెస్టారెంట్లలోని ఫుడ్ తినట్లేదని సర్ధిచెప్పుకున్నారు.

అయితే.. అధికారుల దాడుల్లో ఇన్ని రోజులు 10 కిలోల నుంచి మొదలు 100 కిలోల వరకు కల్తీ అల్లం వెల్లుల్లిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒకటో రెండో సందర్భాల్లో 300 కిలోలు కూడా సీజ్ చేశారు. కానీ.. ఈసారి మాత్రం అంతకు మించి.. ఏకంగా 1500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు సీజ్ చేయటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఈ టన్నుల కొద్దీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును ప్రముఖ హోటళ్లు, ఫేమస్ రెస్టారెంట్లకే సరఫరా వేస్తున్నారన్న విషయం గొంతులో ఘాటెక్కిస్తోంది.

తాజాగా.. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో భారీ ఎత్తున కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. బోయిన్‌పల్లిలోని రాజరాజేశ్వరి నగర్‌లో ఖార్కానాలో “సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌” పేరుతో ఈ కల్తీ భాగోతాన్ని నడిపిస్తున్నారు. ఆదివారం (నవంబర్ 17న) రోజున కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, బోయిన్‌పల్లి పోలీసులు సంయుక్తంగా తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడగా.. మరో నాలుగున్నర లక్షలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button