Uncategorized

ఇలా జాగ్రత్తలు పాటిస్తూ కూడా సినిమాలు తీస్తాం.. అనన్య నాగళ్లను ప్రశ్న అడిగిన రిపోర్టర్‌కు గట్టిగా ఇచ్చిన డైరెక్టర్

తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు అని.. అది వేరే ఇండస్ట్రీలో ఉండదని.. కేవలం ఇక్కడే ఉంటుందని.. అగ్రిమెంట్లోనే కమిట్మెంట్ గురించి ఉంటుందని.. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారని.. కమిట్మెంట్లకు ఒప్పుకుంటే ఒక రకంగా రెమ్యూనరేషన్ ఇస్తారని, ఒప్పుకోకపోతే ఇంకోలా రెమ్యూనరేషన్ ఇస్తారని ఇలా ఓ లేడీ రిపోర్టర్ ప్రశ్న రూపంలో తనకు తెలిసిన, తెలియన విషయాలన్ని ప్రస్థావించింది. అంతా ఆమె దగ్గరుండి చూసినట్టుగా, అంతా ఆమెకే తెలుసు అన్నట్టుగా ప్రశ్న వేసింది. అసలు అక్కడ ప్రశ్న వేసినట్టుగా కూడా లేదు.. అంతా ఆమె నిర్దారించుకున్నట్టుగానే ఉంది.

ఇలాంటి పిచ్చి ప్రశ్నకు బుల్ షిట్ అంటూ ఆమె భాషలోనే ఆన్సర్ ఇచ్చింది అనన్య. అంత కచ్చితంగా మీరు ఎలా చెబుతున్నారు? మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అంటే.. సదరు రిపోర్టర్ తెల్లమొహం వేసుకుంది. మీ ఇండస్ట్రీ వాళ్లే, మా స్నేహితులే చెప్పారు అంటూ నీళ్లు నమిలేసింది. ఆ లేడీ రిపోర్టర్‌ను నెటిజన్లు రోస్ట్ చేసి పడేస్తున్నారు. ఆమెపై దారుణంగా బూతులతో రెచ్చిపోతోన్నారు. ఇక ఆమె ప్రశ్న సరైంది కాదంటూ ఇండస్ట్రీ పర్సన్ అయిన వెంకట్ సిద్ధారెడ్డి స్పందించాడు.

‘మల్లేశం సినిమా చాలా వరకూ పోచంపల్లిలో జరిగింది. పోచంపల్లిలో ఉండడానికి హోటల్స్/లాడ్జ్ ఉండవు కాబట్టి అక్కడ కొన్ని ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాం. అనన్య ఒక్కటే అమ్మాయి టీంలో. ఆ అమ్మాయితో ఉండడానికి తోడుగా మరొకరిని ఉంచి, ఆ అమ్మాయి సేఫ్ గా ఉండడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఆ సినిమాలో యాక్ట్ చెయ్యడానికి, పని చెయ్యడానికి వచ్చిన అందరు మేజర్ యాక్టర్స్/టెక్నీషియన్స్ తో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button