తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ప్రతి శనివారం ఆన్‌లైన్‌లో టోకెన్లు, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లు.. ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.

ఇలా లక్కీడిప్ లో టోకెన్లు పొందిన భక్తులకు వారి మొబైల్‌కు మెసేజ్ రూపంలో సమాచారం అందిస్తారు.. అలాగే ఆన్ లైన్‌లో కూడా ఉంచుతారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్‌లో రూ.500/- డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపించి.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది.

లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500/- డిపాజిట్ ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి, వారు చెల్లించిన రూ.500/- డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదు, అంగప్రదక్షిణకు అనుమతించబడరు. కావున ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

గతంలో అంగప్రదక్షిణ 750 టోకెన్లను ప్రతి రోజూ తిరుమలలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా కేటాయించేవారు. భక్తులు క్యూలైన్లలో నిరీక్షించే సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో.. గత ప్రభుత్వ హయాంలో ఈ టోకెన్లను కూడా ఆన్‌లైన్‌ ద్వారానే కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు స్థానికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో.. ప్రతి శనివారం 250 టోకెన్లను స్థానిక ఎమ్మెల్యేకు బదిలీ చేశారు. ఆన్‌లైన్‌లో మిగతా రోజులకు 750 టోకెన్లు కేటాయిస్తే.. శనివారం మాత్రం 500 టోకెన్లు మాత్రమే కేటాయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తర్వాత.. ప్రతి శనివారం ఇచ్చే ఈ 250 టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచాలని టీటీడీ తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు టీటీడీ శాశ్వత నిర్ణయం తీసుకుంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *