ఏపీలో మొదలైన తిరుపతి లడ్డూ వ్యవహారం క్రమంగా పక్క రాష్ట్రానికి కూడా పాకుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా ఉన్న వ్యవహారం క్రమంగా తెలంగాణ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల అపవిత్రమైందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేత మాధవీలత ఇటీవల తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. రైళ్లో భజన చేసుకుంటూ మాధవీలత తిరుమలకు వెళ్లారు. …
Read More »పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కల సాకారం కావడంలో …
Read More »అంతా అద్దెలకే పోతుంది.. అక్కడ 2Bhk రెంట్ నెలకు రూ. 1.35 లక్షలు.. అడ్వాన్స్ 4 లక్షలు.. ఎలా కట్టేది?
2BHK Apartment Rents: దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడితే ముందుగా ముంబై గురించి మాట్లాడుతుంటారు. అక్కడ బహుళ అంతస్తుల భవనాలే దర్శనం ఇస్తుంటాయని చెప్పొచ్చు. ఇక ఇళ్ల లేదా ఫ్లాట్స్ అమ్మకాలు అక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. ధరలు కూడా భారీగానే పలుకుతుంటాయి. ముంబై తర్వాత ఢిల్లీ- NCR, బెంగలూరు, పుణె, చెన్నై ఇలా మాట్లాడుకుంటుంటారు. అయితే కొంత కాలంగా ఈ పరిస్థితి మారిపోయింది. బెంగళూరులో మార్కెట్ క్షీణిస్తూ వస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అమాంతం పుంజుకొని దేశ ఆర్థిక రాజధాని అయిన …
Read More »ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి.. చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాల్లో ప్రోటోకాల్స్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండగలుగా ప్రకటించిన సందర్భాల్లో.. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించే అంశంపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను.. సంబంధిత జిల్లా సీనియర్ మంత్రి గానీ, దేవాదాయ శాఖ మంత్రి గానీ, ఇంఛార్జ్ మంత్రి గానీ సమర్పిస్తారు. ఈ మేరకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ పండగల సమయంలో ఆలయాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్పై …
Read More »ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్.. ఈ బస్సుల్లో టికెట్లపై 10శాతం రాయితీ
ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది.. బస్సు టికెట్లపై 10శాతం రాయితీ ఇస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి, వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీని ఇస్తోంది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆ ఆఫర్ ఉంటుంది.. అయితే ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్)లను మినహా మిగిలిన రోజుల్లో ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా రూట్లలో, ఆ బస్సుల్లో ఛార్జీల వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు. …
Read More »ఏపీలో వాళ్లందరికి రెండు నెలల పింఛన్ కలిపి ఇస్తారు.. ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వారందరికి రెండు నెలలకు కలిపి పింఛన్లను పంపిణీ చేయనుంది. సెప్టెంబర్ తొలివారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు, వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ 1న భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు. అయితే ఇప్పటికీ మరికొందరు పింఛన్లు అందుకోలేకపోవడంతో.. వారంతా ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ …
Read More »వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 28, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. వృషభ రాశి వారు ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. మిథున రాశి వారికి రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. …
Read More »కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు.. ముడా స్కామ్లో అరెస్ట్ తప్పదా!
MUDA Case: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-ముడా భూముల కుంభకోణం.. కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో స్వయంగా సీఎం సిద్ధరామయ్యపైనే కేసు నమోదు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను తాజాగా ఈ కేసులో నిందితుడిగా లోకాయుక్త పేర్కొంది. ఈ కేసులో ఏ1గా సిద్ధరామయ్య పేరును ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు. సిద్ధరామయ్యతోపాటు ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితోపాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. ఈ …
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బదులుగా.. కేంద్రం కొత్త ప్లాన్!
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. …
Read More »వామ్మో, ఈ కండోమ్ ధర రూ.44 వేలు.. ప్రపంచంలో ఖరీదైందిగా రికార్డ్
సాధారణంగా రూ.10 కో, రూ.20కో దొరికే కండోమ్ మనం చాలానే చూసి ఉంటాం. ఇక మార్కెట్లో రకరకాల కంపెనీలకు సంబంధించిన కండోమ్లు విక్రయిస్తూ ఉన్నారు. సురక్షిత శృంగారానికి, అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఉపయోగించే కండోమ్కు సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ధర ఏకంగా అక్షరాలా 44 వేల రూపాయలు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కండోమ్ ధర రూ.44 వేలు ఏంటి అని అది విన్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. 200 ఏళ్ల …
Read More »తిరుమల డిక్లరేషన్ వివాదం.. నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి …
Read More »అల్లూరి జిల్లా: వాగు ఒడ్డున బంగారు వర్ణంలో హనుమాన్ విగ్రహం.. చూసేందుకు జనం క్యూ, ప్రత్యేక పూజలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులో హనుమాన్ విగ్రహం కొట్టుకువచ్చింది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి దగ్గర మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం వరదకు కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగు నీటి నుంచి ఒడ్డుకు చేరి ఇసుక దిబ్బల్లో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. హనుమంతుడి విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోయింది.. విగ్రహాన్ని ఇసుక నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి జడ్డంగి రామాలయంలో ఉంచారు. హనుమాన్ విగ్రహాన్ని మంచి ముహూర్తం చూసి ప్రతిష్ఠిస్తామని గ్రామ …
Read More »విజయవాడ: నీళ్లలో తిరిగి కాలు పోగొట్టుకున్న బాలుడు.. ఆ బ్యాక్టీరియా చాలా డేంజర్
ఇటీవల వరదలు విజయవాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అయితే వరద నీటిలో తిరిగిన ఓ బాలుడు కాలును పోగొట్టుకున్నాడు. నీళ్లలో తిరిగితే కాలు పోయిందా అంటే.. దీనికి వెనుక కారణం ఉంది. ఒక బ్యాక్టీరియా కారణంగా బాలుడు కాలును కోల్పోవాల్సి వచ్చింది.. రెండో కాలుకు కూడా ఆ బ్యాక్టీరియా సోకింది. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న కొత్తా నాగరాజు ప్రైవేట్ కంపెనీలో.. కోడలు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుమారుడు భవదీప్ ఏడో తరగతి చదువుతున్నాడు. భవదీప్ …
Read More »శాంసంగ్ ఆఫర్ల జాతర.. భారీ డిస్కౌంట్లతో లభించే స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్మెషీన్లు, ఫ్రిజ్లు ఇవే!
Samsung Fab Grab Fest Sale 2024 : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ (Fab Grab Fest) సేల్ ప్రకటించింది. ఈ ఫెస్ట్ సేల్లో భాగంగా సెలెక్టెడ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, గెలాక్సీ బుక్స్, టాబ్లెట్లు, టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. ఈనెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్లపై గరిష్టంగా 53 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. శాంసంగ్ వెబ్ సైట్, శాంసంగ్ షాప్ యాప్, …
Read More »హైదరాబాద్లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. ఆఫీసులకు మాత్రం ఫుల్ డిమాండ్.. ధరల్లో తగ్గేదేలే..!
Hyderabad Home Prices: హైదరాబాద్ నగరం పేరు గత కొన్ని సంవత్సరాలుగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఇళ్లు, భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఆ మధ్య కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లకుపైగా పలికింది. ఆ తర్వాత కూడా ఇలాంటి డీల్స్ చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే ఇళ్లు, ప్లాట్లు సహా ఫ్లాట్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అద్దెలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. రేట్లు ఎంత …
Read More »