అన్నకు రాఖీ కట్టిన చెల్లి.. కవితను చూసి కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. భావోద్వేగ దృశ్యాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలల తర్వాత బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న కవితను చూసి.. తన తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులందరి సమక్షంలో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. దీంతో.. కవిత ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *