తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బందికి టీడీపీ ఎంపీ, మహిళా ఎమ్మెల్యే బహుమానం

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి కలిసి వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ చేతులమీదుగా వస్త్రాలను అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బంది శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బందికి ఆదివారం సేలంకు చెందిన మెక్కినేశ్వరి టెక్స్టైల్స్ అధినేత తంగదొరై దంపతులు వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేతులమీదుగా వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *